దేశంలో కరోనా  వైరస్ కోరలు చాస్తూ విజృంభిస్తున్న  నేపథ్యంలో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు  మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు వరకు ఎంత మంది సినీ ప్రముఖులు కరోనా  యుద్ధంలో భాగంగా కోట్ల రూపాయల విరాళాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా పేద ప్రజలకు సహాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పెద్ద మనసు చేసుకొని విరాళాలు అందించారు . ఇక తాజాగా కరోనా  వైరస్ పై పోరాటం చేస్తున్న డాక్టర్లను దృష్టిలో పెట్టుకొని... వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బాలీవుడ్ నటుడు సోను సూద్ సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 

 

 

 విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సోనుసూద్. అయితే తాజాగా కరోనా పై  పోరాటంలో భాగంగా ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తూ... కరోనా వైరస్ ను  తరిమికొట్టేందుకు ఎంతగానో కృషి చేస్తున్న వైద్య సిబ్బంది సహాయం చేసేందుకు ముందుకొచ్చి... కరోనా  రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి... ముంబైలోని తన హోటల్ ఇచ్చేందుకు నిర్ణయించారు. కరోనా  వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యుల సిబ్బంది ముంబైలో ఉన్న తన హోటల్ లో ఉండవచ్చు అంటూ సూచించాడు సోనుసూద్ . ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సోను సూద్  చెప్పుకొచ్చాడు. 

 

 

 దేశ రక్షణ కోసం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు... దేశం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో... ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ పై  పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు  ఎంత ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్యులు నర్సులు పారామెడికల్ సిబ్బంది... ఈ చిన్న సాయం చేయడం తన కి  గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు సోను సూద్ . ముంబై  నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరీ కరోనా  వైరస్ రోగులకు సేవ చేస్తానని.. అందుకే వారు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కల్పించాలనే ఉద్దేశంతో తన హోటల్లో వినియోగించుకోవాలని సూచించినట్లు సోనియూద్  పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: