ప్రపంచ దేశాలన్నింటినీ విపరీతంగా పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తన ధాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ కొనసాగిస్తోంది. రోజురోజుకీ ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను మరియు దిగువ మధ్య తరగతి ప్రజలను రక్షించేందుకు దాతలు ఎంతో మంది ముందుకు వస్తున్నారు ఇక వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది సంగతి అయితే చెప్పనవసరంలేదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు వైరస్ ను నయం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు..

 

ఇదే క్రమంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కోవిడ్ వారియర్ వారి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్వచ్ఛందంగా వచ్చి కరోనా పై చేసిన పోరాటం లో పాల్గొనేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసి వివిధ ఆసుపత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ప్రత్యేక అధికారి గిరిజాశంకర్ తెలిపారు.

 

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 271 మెడికల్ కాలేజీలు, డెంటల్, యునాని, ఆయుర్వేదిక్ నర్సింగ్ కాలేజీలు ఇతర వైద్య సంబంధిత కోర్సులు చదివే విద్యార్థులు వాలంటీర్లుగా అప్లై చేసుకోవచ్చు అని దాని ద్వారా తెలియజేశారు.

 

వీరి సేవలను ఆస్పత్రుల్లో - క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే  వాలంటీర్లగా ఎంపికైన వారి సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటామని తెలిపారు.  ఇదే సమయంలో ఆలా కోవిడ్ వారియర్స్ గా తమ సేవలని అందివ్వడానికి ముందుకు వచ్చే వారికి ఏపీ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. వీరికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్ మెంట్ లో మొదటి ప్రాధాన్యమిస్తామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: