వైయస్ జగన్ సర్కార్ కరోనా వైరస్ దెబ్బకి అనేక అవస్థలు పడుతోంది. ఆర్థికంగా భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటున్న వైయస్ జగన్ కి ప్రతిపక్షం నుండి దాడి కూడా అదే స్థాయిలో ఉంది. కరోనా కట్టడి చేయడంలో చాలా పకడ్బందీ ప్లానింగ్ తో వెళ్తున్న ప్రతిపక్ష మీడియా మరియు ప్రతిపక్ష నేతలు గట్టిగా టార్గెట్ చేసి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నారు. మామూలుగా కరోనా కట్టడి చేయడంలో మొదటిలో చాలా సక్సెస్ సాధించిన వైఎస్ జగన్ సర్కార్..ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారికి కరోనా వైరస్ సోకటం తో దేశంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా షేక్ అయింది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ పాజిటివ్ ఫలితాలు రావడంతో ఏపీలో ఊహించని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది.

 

ఇటువంటి తరుణంలో విశాఖ కి రాజధాని తరలించే ఆలోచన విషయంలో వైయస్ జగన్ సర్కార్ వాయిదా వేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖపట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ఈ ఏడాది రాజధాని వికేంద్రీకరణ అనేది లేనట్టే అని చాలామంది అంటున్నారు. మరోపక్క అమరావతి నుంచే సచివాలయం పనులు కొనసాగించాలని జగన్ సర్కార్ ఫుల్ గా డిసైడ్ అయిందట. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీ టిడిపి రాజధాని వికేంద్రీకరణ అదేవిధంగా ప్రభుత్వం నుండి అమలవుతున్న జీవోల విషయంలో ప్రతి దానికి అడ్డు పడుతున్న తరుణంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

అదేమిటంటే ప్రభుత్వం పరంగా విడుదలవుతున్న జీవోలను నిద్రపోవటానికి టిడిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించి చాలావరకు జీవోల విషయంలో జగన్ పై పైచేయి సాధించింది. అయితే ఈ తరుణంలో ఇక జీవోల విషయంలో ముందుగా కేబినెట్లో చర్చించి ఆ జీవో విషయంలో న్యాయపరంగా చిక్కులు రాకుండా న్యాయనిపుణులతో చర్చించి తర్వాత అమలు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విధంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత జగన్ పక్కా ప్లానింగ్ తో రాజకీయాలు చేయాలని దానికి ఇప్పటికీ అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినట్లు వైసీపీ పార్టీలో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: