ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుధాకర్ రావు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. కరోనా వైరస్ చికిత్స చేస్తున్నా వైద్యులకు సరైన వైద్య పరికరాలు మాస్కులు ఇవ్వటం లేదని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా మార్పులు మరియు బ్లౌజులు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు లాంటివి ఇవ్వలేదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటంతో ప్రభుత్వం సీరియస్ గా ఈ విషయంపై ఫోకస్ పెట్టింది.

 

ప్రభుత్వం తరఫున ఒక విచారణ కమిటీని నియమించి...ఆసుపత్రిలో వైద్యులు ఆరోపిస్తున్న ఆరోపణలు వాస్తవమో కాదో తేల్చాలని విచారణ బృందాన్ని హాస్పిటల్ కు పంపారు. అయితే విచారణ కమిటీ రిపోర్టు రాకముందే డాక్టర్ సుధాకర్ ని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. జాతీయ విపత్తు సమయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని.. అలాగే 144 సెక్షన్ ఉల్లంఘించారని… ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించారని.. తన మాటల ద్వారా ప్రజలను భయపెట్టారని.. ఆరోపిస్తూ.. పలు నేరాల కింద.. కేసులు పెట్టారు.

 

ఒక ఉద్దేశపూర్వకంగా డాక్టర్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని వైసిపి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి మద్దతుగా టీడీపీకి అండగా ఉండే మీడియాడాక్టర్ ఎపిసోడ్ ని తమ చానల్స్ లో ప్రసారం చేస్తున్నారని వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో టీడీపీ చేస్తున్న రాజకీయాల పై మండిపడుతున్నారు. ఇదే తరుణంలో ప్రజలు కూడా అన్నీ పక్కన పెట్టి ఈ డాక్టర్ గోలెంటి సామీ అంటూ బాబోరు మీడియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: