కరోనా వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలన్ని చైనా పై గుర్రుగా ఉన్నాయి.. ఎందుకంటే ఈ వైరస్‌కు పుట్టినిల్లు చైనా అయితే.. అత్తవారిల్లు అమెరికా అని అభిప్రాయ పడుతున్నారట.. ఇక కరోనా ఒక్కో దేశానికి విస్తరిస్తున్న సమయంలో.. ఒకవేళ భారతదేశంలో గనుక ఈ వైరస్ విస్తరిస్తే పరిస్దితి ఏంటనే భయం ఇటు ఇండియన్ ప్రజల్లో ఏర్పడింది.. అలాగే ప్రపంచ దేశాల చూపు కూడా ఇండియాపై పడింది.. అసలే భారతదేశంలో జనాభా 130 కోట్లు పైచిలుకే మరి అంతలా పాపులేషన్ ఉన్న ఇండియా ఈ వైరస్‌ను ఎలా ఆపగలుగుతుంది.. ఆర్ధికంగా, ఆధునికంగా అభివృద్ధి చెందిన దేశాలే ఈ కరోనా దాడిని తట్టుకోలేక కుప్పకూలుతుంటే, అన్నిరకాల మతాలకు నిలయమై ఎవరికి వారే మేధావులుగా అన్వయించుకుని బ్రతుకుతున్న ఇండియాపరిస్దితి ఏంటనే ప్రశ్న ప్రపంచదేశాల్లో చర్చగా మారింది..

 

 

ఈ కరోనాను అమెరికా సమర్ధవంతగా ఎదుర్కొంటుంది.. కానీ ఇండియా మాత్రం ఈ విషయంలో చతికిలపడుతుంది అని అనుకున్నారు అంతా.. ఇక్కడే జరిగింది ఎవరూ ఉహించని విషయం.. ఇప్పటివరకు కరోనా ఇండియాలో తన ప్రభావాన్ని మిగతా దేశాలపై చూపినట్లుగా చూపలేకపోయింది.. ఇన్నాళ్లుగా అమెరికాను మించిన దేశం లేదనుకున్న వారి నోళ్లను ఈ కరోనా విషయంలో "ఇండియా" నిజంగా గ్రేట్ అనిపించింది.. ఇకపోతే అమెరికా వైశాల్యం లో మనదేశం కంటే ఎంతో పెద్దది... బాగా ధనవంతులు ఉన్న దేశం.. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడ చాలా ఎక్కువ, ఎంత ఎక్కువంటే.. అక్కడ ఓ మనిషి నెల రోజులు బతకడానికి పెట్టే ఖర్చుతో, ఇండియాలో ఐదుగురు ఉండే రెండు కుటుంబాలు బతుకుతాయి..

 

 

బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన కార్లు, ఆధునిక సాంకేతిక వ్యవసాయం‌, వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్, ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, ఎయిర్ అంబులెన్సులు, చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు, 16ఏళ్ళు దాటితే తల్లి దండ్రులతో సంబంధం లేకుండా బతికే ఫ్రీడమ్, పెళ్ళికి ముందే డేటింగ్ పేరుతో సహజీవనం, అబ్బో ఒకటేమిటి, అమెరికా అంటే భూతల స్వర్గం.. మరి నేటి పరిస్థితి.. 35 కోట్లు ఉన్న జనాభాని కంట్రోల్ చేయలేక, రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణించిన వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానంలో స్ధలం లేక, వాళ్ళని పూడ్చడానికి మనుషులు దొరక్క, పెరుగుతున్న రోగులకి వైద్యం చేయడానికి బెడ్స్ సరిపోక, డాక్టర్లకి కావాల్సిన ఎక్యూప్మెంట్లు దొరక్క, శవాలని ఎక్కడ పూడ్చాలో అర్థం కాక, చివరికి పబ్లిక్ పార్కుల్లో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి... మరి ఇండియా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... కానీ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మాత్రం చాలా ఉంది..

 

 

రాబోయే పరిస్థితిని ముందుగానే అంచనా వేయడం, విదేశాలనుంచి వచ్చే వాళ్ళని రాకుండా ఆపేయడం, ఒకరినుండి ఇంకొకరికి కనెక్షన్ లేకుండా లాక్ డౌన్ పెట్టడం కాస్త కఠినంగా ప్రవర్తిస్తున్నా, బాధ్యత లేనోళ్ళని కంట్రోల్లో పెట్టడం, వ్యాధి సోకిన వారితో పాటు కుటుంబ సభ్యులకు, చుట్టు పక్కల వాళ్ళకి పరీక్షలు చేసి, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్లో ఉంచడం... ఒక్కసారి ఆలోచించండి.. 135 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటికి రోగుల సంఖ్య 4 అంకెలు దాటకపోవడం అంటే చిన్న విషయం కాదుగా.. మరణించిన వాళ్ళు కూడ 2 అంకెలు దాటలేదు..

 

 

ఒకరకంగా అమెరికా, లండన్ ,ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలతో పోలిస్తే, మనం ఎన్నో వేల రేట్లు నయం, అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా మనవైపు చూస్తోంది.. ఈ వ్యాధి ఇండియాలో వస్తే, శవాలగుట్టలు చూస్తాము అని వాగిన నోర్లే, ఈరోజు నోరెళ్ళబెట్టి మనవైపు చూస్తున్నాయి.. అంతేకాక ఈరోజు మన మందులకోసం 30దేశాలు క్యూ లో వెయిట్ చేస్తున్నాయి... ఇది మనకు తెలియని మనదేశ గొప్పతనం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: