మద్దాలి శివారెడ్డి ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తొచ్చేది రేసుగుర్రం లో విలన్ పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులు సంపాదించుకున్న వ్యక్తి. అల్లు అరవింద్ నిర్మాతగా బన్నీ హీరోగా  వచ్చిన  రేసుగుర్రం సినిమా లో  మద్దాలి శివారెడ్డి అనే పవర్ఫుల్ విలన్ పాత్ర ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికీ ఈ పాత్రను తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన వ్యక్తి పేరు రవి కిషన్. రవి కిషన్  భోజపురి  ఎంపీ. అయితే ప్రస్తుతం ఈయన  గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అంటే. 

 

 కరోనా  వైరస్పై పోరాటంలో భాగంగా చాలా మంది ఎంపీలు తమ జీతాన్ని లేదా ఇతర విరాళాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ ల  జీతాలో   కోతలు విధించింది . అయితే దేశవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భోజపురి  ఎంపీ అయిన రవి కిషన్ ఏకంగా తన ఐదు సంవత్సరాల జీవితాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి డొనేట్  చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా  వైరస్ పై  పోరాటంలో భాగంగా తన ఐదు సంవత్సరాల జీవితాన్ని పూర్తిగా సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తాను  అంటూ ఎంపీ రవి కిషన్ చెప్పుకొచ్చాడు. 

 

 


 అయితే ప్రస్తుత ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ చాలా మటుకు సెటిల్  గా ఉన్నవారే.  వాళ్ళకి ఎంపీగా వచ్చే జీతం  లెక్కలోకి రాదు. కానీ కరోనా వైరస్  పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా  పై పోరాటం చేసేందుకు ఎవరూ కూడా తమ జీతాలని డొనేట్  చేయలేదు. ఒకవేళ చేసినా చాలా తక్కువ మంది చేశారు. ఈ సందర్భంలోనే తన ఐదేళ్ల జీవితాన్ని పిఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తున్నట్లు ఎంపీ రవి కిషన్  ప్రకటించారు. అయితే ప్రస్తుతం  రవి కిషన్ చేసిన పని పై విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రవి కిషన్ లాగానే మిగతా ఎంపీలు కూడా ముందుకు వచ్చి కరోనా పోరాటంలో భాగస్వాములు కావాలంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: