చైనా దేశంలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. దాదాపు భూమి మీద ఉన్న అన్ని దేశాలలో ఈ వైరస్ వ్యాపించి ఉంది. అంతే కాకుండా 16 లక్షల మందిలో ఈ కరోనా వైరస్ దాగి ఉన్నట్లు అదే విధంగా 90 వేల మంది ఈ వైరస్ వల్ల మరణించినట్లు అంతర్జాతీయ స్థాయిలో లెక్కలు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అన్ని దేశాల్లో ఈ కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. కొన్ని దేశాలను శవాల దిబ్బగా మారిపోయాయి. ముఖ్యంగా ప్రపంచానికి అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశంలో దాదాపు ఐదు లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు కాగా...కొన్ని వేల మంది ఈ వైరస్ వల్ల చనిపోవడం జరిగింది.

 

ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 1600 మందికి పైగా మరణించారు. ఇటలీలో రోమ్ నగరంలో కూడా పరిస్థితులు మరీ దిగజారుతున్నాయి. బ్రిటన్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో అక్కడ మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. దాదాపు ఏడు వేల మంది కరోనా వైరస్ వల్ల చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు ఉన్న కొద్దీ పెరుగుతున్నాయి.

 

దాదాపు 6 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 200 కి చేరువలో మరణాలు ఉన్నాయి. అయితే మన దేశంలో లాక్ డౌన్ ని పక్కగా అమలు చేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అన్ని చోట్ల పాజిటివ్ మరియు మరణాల సంఖ్య స్పష్టంగా ఉన్నా రికవర్ నెంబర్ సంఖ్య సరిగ్గా అంచనా ఏ దేశంలో లేకపోవటంతో అందరూ అటు ఇటు గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరణాల రేటు సంఖ్య తగ్గి రికవరీ రేటు సంఖ్య పెరిగితే కచ్చితంగా ప్రపంచం మొత్తం హ్యాపీ గా ఉంటుందని...రికవరీ రేటుకు తగ్గ వైద్యం ఏ దేశంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదని చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: