ఒక పక్క కరోనా ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే మరో పక్క గాలి మరియు వడగండ్ల వానలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి . రైతు తనపంట చేతికి వచ్చిందన్న సంతోషంతో ఆనందించే లోపు పంటపొలాలను నాశనం చేస్తూ వరుణుడు ఆనందిస్తున్నాడు . గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఏపీలో భారీ గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. కర్నూలు జిల్లాలో అధికశాతం వర్షపాతం నమోదు కబడ్డాయి . నెల్లూరు లో భారీ వర్ష ప్రభావానికి అపార పంట నష్టం మరియు దీనికి తోడు ఉరుములు మరియు మెరుపుల కారణంగా దాదాపుగా 14  మంది మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, జిల్లాలో ఒకరు అదేవిధంగా నెల్లూరు లో 7  మంది కలిపి మొత్తం 14  మంది ప్రాణాలను కోల్పోయారు .

 

 

ఈ నష్టాన్ని పూరించామని ఏపీ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు . అదేవిధంగా ఇప్పటివరకు 140  కరోనా హాట్ స్పాట్ లను గుర్తించారు . ఈ సందర్భంగా సీసీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు కనీసం 10  లక్షల నష్టపరిహారాన్ని చెల్లించవలసినది కోరారు . అదేవిధంగా త్వరితగతిన పంట నష్టాన్ని అంచనావేసి పంట నష్టాన్ని చెల్లించవలసినది గా ప్రభుత్వానికి ఆ లేఖలో కోరారు 

మరింత సమాచారం తెలుసుకోండి: