కరోనా దెబ్బకు ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే. దీంతో అందరూ ఎవరికి వారు వారి ఇళ్లలోనే ఉండిపోయారు. దీనితో ప్రజలు ఎవరు బయటకు రావడం లేదు. నిజానికి వేడుకలు వినోదాలు అన్ని ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిదీ ఆగిపోయాయి. ఇంకా అసలు చిన్న చిన్న కార్యక్రమాలు ఎవరు చేయడమే మానేశారు. ఇక అసలు విషయానికి వస్తే...

 


ఒక ప్రేమ జంట మాత్రం లాక్ డౌన్ ని ఎదుర్కొని ప్రియురాలు తన ప్రియుడి కోసం ఏకంగా 40 కిలోమీటర్లు నడిచి వెళ్లి తనని వివాహం చేసుకుంది. ఈ విషయం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ఎక్కడో కాదండి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా బందర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈదేప్పలికి చెందిన గొల్లపల్లి సాయి అలాగే అన్నయ్య హనుమాన్ జంక్షన్ కి చెందిన భవాని కొద్దిరోజులుగా ప్రేమ సాగిస్తున్నారు. తీరా ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో వాళ్ళు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రియుడికి ఫోన్ చేసి మా అమ్మాయి జోలికి వస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. దీనితో వీరు ఎక్కువగా ఆలోచించి ఎలా అయినాసరే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

 


ఇక అంతే భవాని జంక్షన్ నుంచి ప్రియుడు దగ్గరికి ప్రియురాలు ఏకంగా 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళింది. కాలినడకన బందర్ వెళ్లి అక్కడ ప్రియుడిని కలిసి ఇద్దరూ వెళ్లి పెళ్ళి చేసుకున్నారు. ఈ వివాహం బుధవారం నాడు జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో పోలీసులు ఇందులో జోక్యం చేసుకున్నారు. పోలీసులు ఇరు కుటుంబాలకు కాస్త నచ్చచెప్పి వారి కుటుంబ సభ్యులకు ప్రేమికులను అప్పగించారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక తమ వద్దకి రావాలని పోలీస్ వారు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: