ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండనే చెప్పవచ్చు. దీనిని అరికట్టడం కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇలా లాక్ అమలు చేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం దేశంలో ఇప్పటికే వేలాది మంది లాక్ డౌన్  తో అష్టకష్టాలు పడుతున్నారు. చాలామంది తినడానికి సరిపడి తిండి లేని పరిస్థితి కూడా ఉంది. ఇక వలస వచ్చిన కార్మికులు, బాధితుల విషయానికి వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారి కష్టం ద్వారా బతికే వాళ్ళు అయితే ఏ పని లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి బాధితులు ఎలా బయటపడాలో కూడా వారికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

 


ఇది ఇలా ఉండగా ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు కూడా జరిపే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఇక దహన సంస్కారాలు నిర్వహించడానికి కూడా ప్రస్తుతం స్మశాన వాటికలు కూడా దొరక లేని పరిస్థితి ఏర్పడిందంటే నమ్మండి. ఇది ఇలా ఉండగా కొంత మంది పేద వారు అయితే స్మశాన వాటికలలో ఎవరూ లేకపోవడంతో వాళ్లు మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారు.  అంతేకాకుండా ఎవరైనా సాధారణంగా మరణించినా కూడా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, దీనితో పాటు కరోనా పరీక్షలు చేస్తూ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో  కొంత మంది ప్రజలు ఏమి చేయాలో అర్థం కాకుండా తమ వాళ్ల మృతదేహాలను నదిలో కనిపిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

 


ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందరినీ ఆందోళన కలిపిస్తుంది అనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదేవిధంగా లాక్ డౌన్ అమలు అయితే మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయేమో అని అంటున్నారు కొందరు. ఇక కొన్ని ప్రదేశాలలో కుటుంబ సభ్యులకు కనీసం అస్తికలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: