ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంబిస్తు  ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ముఖ్యంగా వృద్దులపై ఈ మహమ్మారి వైరస్  ప్రభావం ఎక్కువగా  చూపుతుందన్న  విషయం తెలిసిందే. వృద్ధులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వృద్దులు  ఎక్కువగా ఈ వైరస్ బారినపడి చనిపోతున్నారు. కానీ ఇక్కడ ఒక భామ మాత్రం ఏకంగా డాక్టర్లని నోరెళ్ళబెట్టేలా  చేసింది. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ను సైతం జయించి... అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది ఈ భామ. ఇంతకీ ఈ భామ వయసు ఎంత అనుకుంటున్నారా... 98 ఏళ్ళు . ఇంకో రెండేళ్ళు గడిస్తే సెంచరీ కొట్టేస్తుంది ఈ బామ్మ. 

 

 

 అయితే ఈ భామను మహమ్మారి కరోనా  వైరస్ కూడా ఏం చేయలేక పోయింది. ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలో కరోనా  వైరస్ బారి నుంచి కోలుకుని అందరిని నోరేళ్ళు పెట్టేలా చేసింది ఈ భామ. కరోనా  వైరస్ బారిన పడిన ఈ భామ చికిత్స అందుకని నాలుగు రోజుల్లోనే పూర్తిగా కోలుకుని స్కాట్లాండ్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ భామ పేరు డిఫ్నే షా  . కేరళలోని కొచ్చి లో జన్మించిన ఈ భామ జులై నెలలో  99 వ ఏట అడుగుపెట్టబోతోంది. అయితే గురువారం ఈ భామలో  కరోనా  వైరస్ లక్షణాలు అయినా జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆమెని డుండి లోని నైన్ వెల్స్ అనే  ఆస్పత్రికి తరలించారు. 

 

 

 అయితే అక్కడ చికిత్స పొందిన భామ కేవలం నాలుగు రోజుల్లో కోలుకుంది. అయితే వృద్ధులపై కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అలాంటిది 98 ఏళ్ల బామ్మ అంటే బతకడం కూడా చాలా కష్టమే . కానీ విచిత్రంగా ఇక్కడున్న 98 ఏళ్ల బామ్మ మాత్రం నాలుగు రోజుల్లోనే కరోనా వైరస్ నుంచి కోలుకుంది. నాలుగు రోజుల్లో ప్రపంచ మహమ్మారిని జయించి హాయిగా ఇంటికి చేరుకుంది. తాను  ఇప్పుడు బాగానే ఉన్నానని  తన బాగోగులు అన్ని తన కొడుకు చూసుకుంటున్నాడు అంటూ తెలిపింది . జూలైలో తన 99 బర్తడే జరుపుకోబోతున్నా అనే ఆలోచన ఎంత బాగుంది  అంటూ ఈ భామ చెప్పుకొచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: