ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు కామపిశాచులు మాత్రం వారి తరహాను మార్చుకోవడం లేదు. ఓ కామాంధుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా పెళ్లి పేరుతో నమ్మించి శారీరక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి కూడా చేసుకుంటాం అని చెప్పి బాలికను మోసం చేయడంతో పాటు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇక ఆ బాలిక గర్భం దాల్చింది అన్న విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు బాలికను గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎటూ పోలేని స్థితిలో ఉన్న బాలికను చూసి స్థానికులు పోలీసు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన పూణే నగరంలో చోటు చేసుకుంది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వస్తే... 24 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికను 15 కిడ్నాప్ చేశాడు. ఆ బాలికను ఒకచోట ఉంచి ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి కిడ్నాప్ కేసు పెట్టడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ దరిద్రుడు తన స్నేహితుడితో కలిసి బాలికను పొలంలోకి తీసుకొని వెళ్లి గొంతు కోసి పరారయ్యాడు. నిజానికి బాలిక కిడ్నాప్ అయ్యి పన్నెండు రోజుల తర్వాత దీనమైన స్థితిలో పొలాలలో బాలిక పడి ఉందని స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. ఈ దీనమైన స్థితిలో ఉన్న బాలికను పోలీస్ అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వైద్యం అందించిన రెండు రోజుల తర్వాత ఆ బాలిక స్పృహ లోకి రావడం జరిగింది. ఇక బాలిక ఇచ్చిన సమాచారం అనుగుణంగా ఆ కామాంధుడిని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 


పోలీస్ అధికారులు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు ఆ సమయంలోనే బాలిక గర్భం దాల్చడంతో బాలికను చంపేయాలని ఆ కామాందుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కిడ్నాప్ కేసులో పోలీసులు తనని వెతుకుతున్నారని తెలియడంతో బాలికను గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఆధారాలతో పోలీసు అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: