కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. లాక్ డౌన్ కారణంగా దేశంలో ఉన్న అన్ని రంగాల్లో మూతపడటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మందులేని ఈ వైరస్ ని అరికట్టాలంటే నియంత్రణ ఒకటే మార్గమని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ చాలా కఠినంగా అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. దీంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోలీసులు రోడ్లపై ఉంటూ ప్రజలను ఇంటి నుండి బయటకు రానీయకుండా చాలా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నారు. ఈ పరిణామంతో చాలామంది మధ్యతరగతి, పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.

 

దీంతో చాలా వరకూ రాష్ట్రాలలో ఉచిత రేషన్ తో పాటు డబ్బులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 17 రకాల సరుకులతో ఒక కిట్ రూపంలో ప్రజలకు ఇవ్వటానికి ముందడుగు వేసింది. 17 రకాల కలిగిన ఈ సరుకులు ఉచితంగానే ఇస్తున్నట్లు కేరళ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తాజాగా వీటికి సంబంధించి పంపిణీ కార్యక్రమం కేరళలో కొన్ని ప్రాంతాలలో స్టార్ట్ అయింది. దాదాపు కిట్టు మొత్తం వెయ్యి రూపాయల విలువైన సరుకులు ఉంటాయని కేరళ ప్రభుత్వం తెలిపింది.

 

కిట్‌లో  బియ్యం, కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల టీ పౌడర్, కారం, కంది పప్పు, అరలీటర్ వంటనూనె, రెండు కేజీల గోధుమ పిండి, కేజీ రవ్వ, మినుములు, శనగలు, సబ్బులు మొదలైన 17 రకాల వస్తువులు ఉంటాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రజలందరూ షాపుల నుంచి వీటిని పొందవచ్చని కేరళ పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఆధార్ కార్డున్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా రేషన్‌, ఆహారాన్ని పంపిణీ చేస్తోంది కేరళ ప్రభుత్వం. కేవలం ప్రభుత్వం రిజిస్టర్ చేసిన దుకాణాల్లో మాత్రమే ఈ కిట్టు లభ్యమవుతుందని కేరళ అధికారులు స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: