కరోనా సమయంలో ప్రతి వైద్యుడు దేవుడిగా మారి సేవలందిస్తుంటే.. కొందరు కంత్రిగాళ్లు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు.. అదీగాక కరోనా విపత్తు సమయంలో కొన్ని చోట్ల పేదల పొట్ట కొట్టడానికి కొందరు దరిద్రులు కూడా వెనుకాడటం లేదు.. అదే సమయంలో మరికొందరు కామోద్రేకంతో రెచ్చిపోయి కాలు జారుతున్నారు.. లోకంలో ఉన్న మనుషులు ఎవడిగోల వాడిదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.. ఇదే అదనుగా దొంగచాటుగా మద్యం అమ్మే వారు కూడా పెరిగిపోయారు..

 

 

ఇకపోతే ఓ మహిళ చేసిన తొదరపాటుపనికి గర్భం రాగా, దొంగ చాటుగా అబార్షన్ చేపించుకుని, ఆ మృత శిశువును చెట్లపొదల్లో పడవేసి వెళ్లిపోగా, ఆ విషయంలో కూపీ లాగుతున్న పోలీసులకు ఒక ఆర్‌ఎంపీ నడుపుతున్న చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది.. ఆ ఆర్‌ఎంపీ పేరు ఖాజాపాషా .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఇతను చేస్తున్న దందాలను తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆర్‌ఎంపీ ఇంటితో పాటుగా, చుట్టుపక్కల మరికొంతమంది ఇళ్లల్లో సోదాలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన వివిధ రకాల ఔషధాలు, ఇంజెక్షన్లు, అబార్షన్‌లకు సంబంధించిన ఇతర పరికరాలు పోలీసుల కంటపడ్డాయి. ఇతను లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్రమంగా మద్యాన్ని కూడా విక్రయిస్తున్నాడని తెలుసుకున్నారు.

 

 

ఈ సందర్భంగా ఇతని వద్ద నుండి సుమారు రూ.50 వేల విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ఈ ఆర్‌ఎంపీ ఖాజాపాషా దగ్గరికి గురువారం రాత్రి అయిదు నెలల గర్భిణి, ఇద్దరు వ్యక్తులు వచ్చి అబార్షన్‌ చేయాలని కోరారు. అందుకు అధిక మొత్తంలో డబ్బును డిమాండ్ చేయగా వారు అతను అడిగినంత పైకాన్ని ముట్ట చెప్పడంతో ఆ మహిళకు అబార్షన్‌ చేసాడు.. పుట్టిన ఆ మృత శిశువును ముళ్లపొదల్లో పడేసి ఆ బాలింత, ఆమెతో పాటుగా వచ్చిన ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం స్థానికులు మృత శిశువును గుర్తించి సమాచారమివ్వడంతో సీఐ వెంకటేశ్వర్లు విచారించారణ చేపట్టగా ఈ భాగోతం బయటకు వచ్చింది.. దీంతో ఆర్‌ఎంపీ డాక్టర్ పరారయ్యాడు.. ఇతనితో పాటుగా ఆ బాలింత, మరో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: