కరోనా  వైరస్ ప్రస్తుతం  ప్రపంచాన్ని చిగురుటాకుల వనికిస్తున్న  విషయం తెలిసిందే . ఈ వైరస్ నియంత్రించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ  రోజు రోజుకు ఈ మహమ్మారి  ఎంతో మందిని బలితీసుకుంది. కోరలు చాస్తున్న కరోనా ను కంట్రోల్  చేయడం ఎవరితరం కావడం లేదు. వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా  ఈ వైరస్ కు  సరైన విరుగుడు  కూడా అందుబాటులో లేకపోవడంతో... ప్రస్తుతం చాలా మందికి ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది . వేల సంఖ్యలో ఈ వైరస్ బారినపడి మృతి చెబుతున్నారు ప్రజలు. 

 

 

 కరోనా ప్రభావం భారతదేశంలో కూడా భారీగానే ఉన్న విషయం తెలిసిందే. రోజు  రోజుకు కరోనా  వైరస్  కేసులు పెరిగిపోతున్న తరుణంలో కరోనా ను   కట్టడి చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు . ఈ క్రమంలోనే ఎంతో  మంది సినీ ప్రముఖులు కరొనా  వైరస్ కారణంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు. అయితే కరోనా వైరస్  ను  నియంత్రించేందుకు తమ వంతుగా సెలబ్రిటీలు అందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ ప్రజలకు కరోనా  పై అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిస్తున్న   విషయం తెలిసిందే. 

 

 

 తాజాగా బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కరోనా  వైరస్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ గా కొనసాగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ధర్మేంద్ర. ఎలాంటి పాత్రలోనైనా తనదైన వైవిధ్యమైన నటనతో మెప్పించి  ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ధర్మేంద్ర సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో కరోనా  వైరస్ పై స్పందించిన ధర్మేంద్ర తన అభిమానులకు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటికైనా మంచి జీవితాన్ని గడపండి మీ యజమానులు మీ కోరికలు తీరుస్తారు  అంటూ ధర్మేంద్ర వ్యాఖ్యానించారు. మనుషులు చేసిన చెడు పనులు ఫలితమే ప్రస్తుతం కరోనా  వైరస్ మృత్యువు అంటూ ధర్మేంద్ర వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: