ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును జగన్ ప్రభుత్వం నియమించింది. పీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఒకప్పుడు మద్రాస్ హైకోర్టులో జడ్జి గా పని చేశారు. అంతేకాకుండా వివిధ కమిషన్ల లో సభ్యుడిగా కూడా కనగరాజు పని చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జి నియమించాలని శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దీంతో వచ్చిన ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ప్రభుత్వం నియమించింది. కాగా మార్చి నెలలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియడంతో వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

మామూలుగా అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఐదేళ్లు ఉండగా దాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో వచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు వెళ్లగా ఆయన ఓకే చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసిన టైం అయింది. స్థానిక ఎన్నికలు ఎవరికీ చెప్పకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయడంతో జగన్ అప్పట్లో తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. అసలు ఎన్నికల వాయిదా గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా ఏ విధంగా వాయిదా వేస్తారు అని.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో గాని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తో కానీ సమస్య గురించి చర్చించకుండా..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో ప్రశ్నించారు.

 

ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర అని జగన్ ఆరోపించడం జరిగింది. అయితే ఇటీవల ఒక్కసారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలాన్ని తగ్గించి పదవి నుంచి తొలగించడం తో ఏపీలో ఈ వార్త సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్నవాళ్లు ఏదైనా చేయగలరు అని తాజా నిర్ణయంతో జగన్ ప్రత్యర్థులకు మంచి సందేశం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయాలు చేస్తే అధికారంలో ఉన్న నాయకులు ఎలాంటి గుణపాఠం చెబుతారు అన్నదానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది అని చాలామంది అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: