దేశంలో అసలే కరోనాతో యుద్దం చేస్తూ లాక్ డౌన్ నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంతో ప్రజల గజ్జున వణికి పోతున్నారు. ఈ నేపథ్యంలో నడిరోడ్డు మీద నడిచి వెళుతుంటే, రోడ్డుపై డబ్బులు కనిపిస్తే, ఏం చేస్తాం. తీసి కళ్లకద్దుకుని జేబులో పెట్టుకుంటాం. లేదంటే, ఆ డబ్బు ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. అంతే కానా ఈ బుద్ది ఉన్నోడు డబ్బును పక్కన బెట్టి వెళ్లీపోరు.
కానీ, కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న వేళ, కావాలనే కొందరు వైరస్ ను వ్యాపిస్తున్నారన్న వదంతులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న వేళ, కర్ణాటకలో జరిగిన ఓ ఘటన చోటు చేసుకుంది. అయితే కొంత మంది ఆకతాయిలు నోట్లపై ఉమ్ము వేసి డబ్బు అక్కడ వెదజల్లారాని.. కరోనా వ్యాప్తి చేస్తున్నారన్న అనుమానం రావడంలో అక్కడ ప్రజలు ఆ డబ్బును తగుల బెట్టారు.
ఈ ఘటన కర్ణాటకలోని కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో జరిగింది. ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన ముగ్గురు అపరిచితులు, తొలుత తమ ఫోన్ లో మాట్లాడారని, ఆపై డబ్బులు పారేసి వెళ్లినట్టు తాము చూశామని కొందరు స్థానిక మహిళలు వెల్లడించారు. అనుమనం వచ్చి ఆ డబ్బును వెంటనే తగుల బెట్టామని స్థానికులు అంటున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple