అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల నుంచి... కాటికి కాలు చాపిన ముసలమ్మల వరకు... ఎవరికి రక్షణ లేకుండా పోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి పశు వాంఛ  తీర్చుకోవడానికి మీద పడిపోతున్నారు మంచివాళ్ళ ముసుగులో ఉన్న మృగాళ్లు . ఇలాంటి అత్యాచారం ఘటనలు  రోజుకు ఎక్కువవుతున్నాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన వారిని శిక్షించడానికి కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎవరిలో  మార్పు రావడం లేదు. ఎక్కడ భయం మాత్రం కనిపించడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆడపిల్లలపై అఘాయిత్యాలకు  పాల్పడుతున్నారు. వెరసి ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కామపు  కోరల్లో చిక్కుకుని బలవుతున్నారు. 

 

 

 దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టలంటేనే  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్షణ లేని ప్రశ్నార్ధక జీవితాన్ని గడపాల్సి వస్తుంది సగటు మహిళ. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9 ఏళ్ళ  బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు  ఇక్కడొక కామపిశాచి. ఇక నొప్పి తట్టుకోలేక బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా ఎంతగానో కలకాలం రేపింది . వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు 9 ఏళ్ళ  కుమార్తె ఉంది . అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులిద్దరూ పని మీద బయటకు వెళ్లారు. 

 

 

 ఇక తల్లిదండ్రులు ఇంట్లో లేరు అని  గ్రహించిన నిందితుడు ... ఇంట్లోకి జొరబడ్డాడు.. తొమ్మిదేళ్ల బాలికపై అతి దారుణంగా అత్యాచారం చేశాడు. బలవంతంగా 9 ఏళ్ల బాలికను మేడపైకి తీసుకెళ్లి అత్యాచారం చేయగా.... భయాందోళనకు గురైన బాలిక గట్టిగా కేకలు వేయడంతో అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు హుటిన చేరుకున్నాడు ఇంతలోనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్ లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఇక నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: