తెలంగాణలో గత బుధవారం నుంచి తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు, తిరిగి విజృంభించడం ప్రజల్లో ఆందోళన పెంచింది. ఇక ఆదివారం రాష్ట్రంలో మరో 28 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకు చూస్తే ఓవరాల్గా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 531కు చేరుకుంది. మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో పాటు 16 మంది మృతి చెందడంతో కేసీఆర్కు మరింత సవాల్గా మారింది. ఈ క్రమంలోనే ఆయన లాక్డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన కంటైన్మెంట్ క్లస్టర్లలో ప్రజలకు సూపర్ ఆఫర్ ఇచ్చారు.
ఇక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 126 కంటైన్మెంట్ క్లస్టర్లను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్కరూ అడుగు బయటపెట్టకుండా కావాల్సిన నిత్యావసరాలు, ఇతర సరకులను సిబ్బంది నేరుగా అందిస్తున్నారు. ఆదివారం ఉదయం 8గంటల వరకు ఈ క్లస్టర్లలో పాల ప్యాకెట్లను బల్దియా సిబ్బంది సరఫరా చేశారు. ఇక ఎవరికి అయినా ఏ ఇబ్బందులు అయినా ఉంటే నేరుగా కాల్ చేయాలని ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple