కరోనాతో దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. భౌతిక దూరం పాటించడంలో అక్కడి ప్రజలు విఫలమవ్వడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా...వైరస్ సామూహిక వ్యాప్తికి చేరుకున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్కు అమలుకు ఆదేశించినా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా మృతదేహాలా ఖననాన్ని వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి వస్తుండటంతో ఈక్వెడార్లో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
కరోనా మృతదేహాలను ఖననం చేయడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ఇళ్ల ఎదుటే శవాలను రోజుల తరబడి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన భద్రతలను చేపట్టకుండానే మృతదేహాలను వీధుల్లో, వాకిళ్లలో వదిలేస్తున్నారు. ఇదే సమయంలో సాధారణ మృతదేహాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల ఎదుట శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి అంత్యక్రియలు చేయడానికి వేచి చూసి చివరికి చేసేదేమిలేక సముద్రాలలో కూడా శవాలను పడేస్తున్నారు. ఇది మిగతా దేశాలకు చాల పెద్ద పరిణామంగా తయారయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అలాగే 1.7 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్లో ఇప్పటికే 7,466 మందికి కరోనా సోకగా 333 మంది మృతిచెందినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ మృతుల సంఖ్య అధికారికంగా చెప్పిన దానికి కొన్ని రెట్లు అధికంగా ఉంటుందని ఆరోగ్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రపంచంలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న స్పెయిన్, ఇటలీలతో ఈక్వెడార్కు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తగా, ఆర్థిక అసమానతలు కూడా మరోకారణంగా తెలుస్తోంది. పని చేస్తే కానీ ఆహారం దొరకని పేద వారు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఎంత చెప్పినా వారు పనుల్లోకి వెళ్లడం వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple