ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే... దాదాపు రెండు వారాల నుంచి దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. కరోనా నియంత్రణ నేపథ్యంలో దేశ ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు భాబించిన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది . ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది . అయితే రెండు మూడు రోజుల వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది అందరికి. ఇంకేముంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని తేడా లేకుండా ఆన్లైన్ చాటింగ్ చేయడం మొదలుపెట్టారు . ఫ్యామిలీతో గడపడం.. చాటింగ్ లో నిమగ్నమైపోవటం ఇంట్లో ఉంటేనే ఇలాంటి పనిచేస్తూ ఉంటారు.
అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ పెరిగిపోయినప్పటినుంచి ఇంటర్నెట్ వాడకం ఒక్కసారిగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. ఎక్కువగా ఆన్లైన్లోనే గడుపుతున్నారు చాలామంది. కొంతమంది ఆన్లైన్లో చాటింగ్ చేయడానికి ఇష్టపడితే ఇంకొంతమంది... ఆన్లైన్లో సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు . ఇక చాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఎక్స్ప్రెషన్ కి ఒక ఎమోజి ని వాడుకోవడానికి వీలుంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఖాళీ టైం దొరకడం తో ఏమోజీ, స్టికర్ వాడకం బాగా పెరిగిపోయింది. కరోనా వైరస్ తో ముడిపెట్టి సరదాగా ఎమోజిలను ఎక్కువగా ఉపయోగిస్తుండటం జరుగుతుంది.
అయితే లాక్ డౌన్ ఉన్న సమయంలో ప్రజలు ఎక్కువగా ఎలాంటి ఎమోజి లను వాడుతున్నారు అని తెలుసుకోవడానికి ఒక సర్వే నిర్వహించాడు. దీని ప్రకారం కొన్ని ఏమోజీలను ప్రజలు ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫేస్ విత్ ఇయర్స్ ఆఫ్ జాయ్, అండ్ మాస్క్, థింకింగ్ ఫేస్. మైక్రోబ్ ఎమోజిలు ఎక్కువగా వాడారట నెటిజన్లు. ఎమోజి స్కేల్ రెండువేల కి గాను లోఫెత్ విత్ టియర్స్ పద్దెనిమిది వందల మార్కు దాటగా... ఫేస్ విత్ టియర్స్ రెండో ప్లేస్లో ఉంది. మాస్క్, మైక్రోబ్, క్రయింగ్ ఎమోజీ లు కూడా తర్వాత ప్లేస్ లో ఉన్నాయి. మరోవైపు ఇటలీ చైనా స్పెయిన్ దేశపు జెండా లను కూడా బాగానే వాడేసారు .