ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కారు నడుస్తోంది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నుంచి నిజానికి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఒకవైపు మంచి ఎలా ఉంటుందో మరోవైపు చెడు కూడా అలాగే జరుగుతుంది. కొంతమంది జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పథకాల పరంగా కానీ, ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు గాని, ఎవరినన్నా బెదిరించడం లాంటి విషయాలపై జగన్ సర్కార్ పై రెడ్ మార్క్ పడుతుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జగన్ సర్కార్ ని ఏకి పారేశారు. ఆయన తన లెటర్ ప్యాడ్ లో పాత్రికేయులకు ఒక నోట్ ని రాసి ఇవ్వడం జరిగింది. ఇక అందులో ఏముందో చూద్దామా మరి..

 


పాత్రికేయ మిత్రులు నమస్కారం, ఈ రోజు సాయంత్రం నుంచి నాకు పలు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్ వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని విమర్శిస్తున్నానని నీ అంతు చూస్తాం. కేసులలో ఇరికిస్తాం అని హెచ్చరించడం జరిగింది. మొన్న మాచర్లలో నాపై హత్యా ప్రయత్నం జరిగింది. మళ్ళీ ఇలా ఫోన్లో బెదిరించడానిని చూస్తే ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్య చేస్తుందని అర్ధమవుతుంది. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి చెపుతున్న - ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలని తట్టుకోలేని వారు వ్యక్తి గతమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య మీద నమ్మకంతో ప్రజలకు మేలు చేయతలచినవారు సరి చేసుకోనుటకు ప్రయత్నిస్తాం. నిగ్రహం కోల్పోయి ప్రజల్లో అబాసుపాలకవద్దు. మీరు చంద్రబాబుని ఎమైనా అనొచ్చు. కానీ మేము చేసే విమర్శలను తట్టుకోలేరా...? మీరు చేసే బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఇట్లు బుద్ధా వెంకన్న. 

 

 


ఇలా ఆయన లెటర్ ప్యాడ్ లో రాసి పాత్రికేయలకు ఇవ్వడం జరిగింది. నీకానికి అక్కడ ఎం జరుగుతుందో ప్రజలకి ఇంకా స్పష్టత ఏం రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: