టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోల్లో నిర్మాతగా ఎక్కువగా రాణిస్తున్న హీరో రామ్ చరణ్. ఏ యువ హీరో కూడా ఇన్ని సినిమాలను ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చరిత్ర లేదు అనే విషయం అందరికి తెలిసిందే. రామ్ చరణ్ తన తండ్రి తో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తన తండ్రి కూడా ఎక్కువగా రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. వేరే నిర్మాతలు అయితే ఇప్పుడు డిమాండ్ లు ఎక్కువగా చేస్తారని రామ్ చరణ్ అయితే ఆ గోల ఉండదు అని చిరంజీవి భావిస్తున్నట్టు సమాచారం. 

 

అందుకే చిరంజీవి వేరే నిర్మాతలను పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఇప్పుడు చిరంజీవి సినిమాల విషయంలో ఏ స్పష్టత కు రావడం లేదు. ఆయన సినిమా చెయ్యాలి అనుకున్నా సరే రామ్ చరణ్ ఆలోచిస్తున్నారు. దానికి కారణం చిరంజీవి సినిమాలతో రామ్ చరణ్ కి భారీగా నష్టం వస్తుంది అని సమాచారం. చిరంజీవి పారితోషికం తీసుకోకపోయినా లాభంలో సగం తీసుకుంటున్నాడు అనే భావనలో రామ్ చరణ్ ఉన్నారట. అందుకే లూసిఫర్ సినిమా విషయంలో రామ్ చరణ్ వెనక్కు తగ్గాడని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. 

 

లూఫిఫార్ సినిమా సినిమాను చిరంజీవి చెయ్యాలని కథను కొనుగోలు చేసి మార్పిస్తున్నాడు రామ్ చరణ్. కాని ఇప్పుడు నష్టం వస్తుంది ఏమో అనే భయంలో ఉండి వెనక్కు తగ్గి వేరే హీరోని ఎంపిక చెయ్యాలి అని చూస్తున్నాడట. ఇది నిజమో కాదు తెలియదు గాని ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ఎక్కువగా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ జనాలు కూడా దీని మీదే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ భయపడినట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: