క‌రోనా వైర‌స్ కోర‌లు చాచిన వేళ వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ కూడా వారి ఇళ్ళ‌ల్లో వారి ఫ్యామిలీల‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సినిమావాళ్ళ నుంచి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఎంతో క‌ష్ట‌ప‌డి వారి వారి ప‌నుల్ని ప‌క్క‌కు పెట్టి మ‌రీ ఇళ్ళ‌ల్లోనే ఉంటున్నారు. దీంతో త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొంద‌రు పిల్ల‌ల‌తో ఆడుకుంటుంటే మ‌రికొంద‌రు వంట‌లు చేస్తూ ఇలా ఒకొక్క‌రు ఒక్కో ప‌నిలో నిమ‌గ్న‌మ‌యి ఉన్నారు. అంతేకాక ఆ ఫొట‌లోను వీడియోల‌ను త‌మ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా ట‌చ్‌లో ఉంటున్నారు.

 

కరోనా లాక్‌డౌన్ దెబ్బ ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీల మీద కూడా పడింది. ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నేతలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.. టైంపాస్ చేస్తున్నారు. పుస్తకాలు చదవడం.. చిన్న పిల్లలు ఉంటే వారితో గడపడం ఇలా కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది అయితే కిచెన్ కింగుల్లా మారుతున్నారు.. గరిటె పట్టి వంటలు చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలో ఉంటున్న ఈ పొలిటికల్ సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఇక మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అలాగే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి దంపతులు లాక్‌డౌన్ దెబ్బకు ఇంటికే పరిమితం అయ్యారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. వీకెండ్ కావడంతో అంద‌రూ సరాదాగా భార్యాభర్తలు ఇద్ద‌రూ క‌లిపి మొత్తానికి  చక్కగా బిర్యానీ, చికెన్ తయారు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయాలు మాత్రమే కాదు వంటల్లో కూడా తమ టాలెంట్ ని చూపిస్తున్నారు. అంతేకాదు మనవడితో సరదాగా గడుపుతున్నారు దగ్గుబాటి దంపతులు. మొత్తానికి అంద‌రూ ఈ లాక్‌డౌన్ అయ్యేవ‌ర‌కు ఇలా త‌మ త‌మ ఇంట్ర‌స్ట్‌ల‌ను బ‌ట్టి వంట‌లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: