వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజూ ఎప్పుడూ రాజకియాలతో అటు టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా ఉండేవారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆమెకు తమ ఫ్యామిలీతో గడిపే సమయం దొరికిందని చెప్పాలి. ఎప్పుడూ బిజీగా ఉంటూ కనీసం పిల్లలకి కూడా సమయాన్ని కేటాయించేలేకపోతున్నట్లు ఇటీవలె ఆమె జబర్దస్త్ షోలో చెప్పి చాలా బాధపడ్డారు రోజా. లాక్ డౌన్ కారణంగా కాస్త సమయం దొరకడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా ఆ సమయాన్ని పిల్లలకే కేటాయించారు. ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే రోజా ఇప్పుడు లాక్డౌన్లో కూడా బిజీగానే ఉంటుంది. అది ఎలా అనుకుంటున్నారా... లాక్డౌన్లో రోజా కిచెన్లో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతానికి కుటుంబంతో టైమ్ పాస్ చేస్తూ ఇప్పుడొక సాధారణ గృహిణిలాగే ఆలోచిస్తుంది. లాక్డౌన్ కారణంగా పనివాళ్ళందరికి కూడా సెలవిచ్చేసింది.
దీంతో పూర్తిగా ఎవరి పని వాళ్ళే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రోజా కూడా ఇదే పనిలో బిజీ అయిపోయింది. రోజూ వంటలు చేస్తూ ఆ వంటలను యూ ట్యూబ్లో పెడుతుంది. అంతేకాదు ఎంత చక్కగా ఒక యాంకర్లాగా ఆ వంట తయారీ విధానం కూడా చెబుతుంది రోజా. మొన్నటికి మొన్న ఈమె చేసిన చికెన్ ఫ్రై చేసి బండ్ల గణేష్ కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఆ తర్వాత రోజు గుత్తి వంకాయ్ ఫ్రై ఎలా చేయాలో చూపించింది రోజా. మళ్లీ కొత్త వంట.. మీ కోసమే రుచికరమైన బీట్రూట్ ఛట్నీ అంటూ వచ్చేసింది ఈ జబర్దస్త్ జడ్జి.
ఇక మరో రెండు వారాల పాటు రోజా మనకి ఈ వంట ప్రోగ్రామ్లో కనిపిస్తూ అలరిస్తూనే ఉంటుందనమాట. ప్రస్తుతం బయట పరిస్థితులు సరిగాలేని కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమయి పిల్లలకు వండి పెడుతూ చక్కగా చూసుకుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మళ్లీ ఇలాంటి టైమ్ జీవితంలో వస్తుందో రాదో తెలియదు. హాలీడేస్ ఉన్నా కుటుంబంతో పాటే బయటికి అడుగు పెట్టకుండా ఉండటం ఎక్కడ సాధ్యపడుతుంది ఈ బిజీ లైఫ్లో. అందుకే వచ్చిన సెలవులను ఫుల్లుగా వాడేసుకుంటుంది ఈమె. అయితే ఇలా కేవలం రోజా మాత్రమే కాదు.. ప్రస్తుతం తెలుగు సినిమా సెలబ్రిటీస్ అంతా పూర్తిగా వంటలతోనే బిజీ అయిపోయారు. వాళ్ల వాళ్ల వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కి కనువిందు చేస్తున్నారు.