వైయస్ జగన్మోహన్ రెడ్డి... ఏపీ ముఖ్యమంత్రిగా, వైసీపీ అధినేతగా తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ పరిచయం అక్కరలేని పేరు. ఎందుకంటే అయన ఒక రాజకీయనాయకుడు అని చెప్పడం కంటే కూడా నాయకుడు అని చెప్పడం కరెక్ట్.. ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు అని నిరూపించిన వ్యక్తి. ఇకపోతే సీఎం జగన్ ప్రస్థానం సాధారణం కాదు.. అసాధారణం..
125 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు చేసి పడేశాడు. పార్లమెంట్ లో అతి పెద్ద నాలుగో పార్టీగా వైసీపీ అవతరించటంలో జగన్ కృషి ఎంత ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నాడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టీ నేడు మహా వృక్షంగా ఎదిగింది. ఇంకా ఇంత కష్టం వెనుక ముగ్గురు రాక్షసుల కథ ఉంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరించిన సమయం నుండి వైఎస్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి.. మనం పైన అనుకున్నట్టే వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు నాయకుడు. అందుకే ప్రజలకు బాగా దగ్గరయ్యాడు.. ఓదార్పు యాత్ర పేరుతో మరింత దగ్గర అయ్యాడు.. అయనకు ప్రజల మద్దతు చూసి అందరూ ఆశ్చర్య పోయారు అంటే నమ్మండి.
అందుకే అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు అందరూ కూడా వైఎస్ కుటుంబానికి ప్రజల మద్దతు చూసి జీర్ణించుకోలేకపోయారు.. వైఎస్ కుటుంబానికి ఎలా అయినా సరే చెక్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు.
అందుకే అష్టకష్టాలు పెట్టారు.. కానీ వారికీ తెలియదు.. అక్కడ వైఎస్ జగన్ వెనుక ముగ్గురు స్త్రీలు ఉన్నారు అని.. వారే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతి.. అందరూ కూడా అన్ని రకాలుగా సీఎం జగన్ వెనుక ఉండి ఆయన్ని గెలిపించారు.. వైఎస్ ఫ్యామిలీ చరిత్రకు చెక్ పెట్టాలనుకున్న బాబోరు, కిరణ్కుమార్, సోనియా అందరూ కూడా అడ్రెస్స్ లేకుండా పోయారు.. స్వార్దానికి మారుపేరు అయినా వారు కనిపించకుండా పోయారు. ఇంకా బాబోరు బతుకు గత ఎన్నికల్లోనే బయటపడింది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.