ఏపిలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య తెగ మాటల యుద్దం కొనసాగుతుంది.  అధికార పక్షాన్ని ఎప్పటికప్పుడు దుయ్యబడుతూ.. ఛాన్సు దొరికినప్పుడుల్లా విమర్శిస్తున్నారు.  ఆ మద్య ఏపి లో మూడు రాజధానుల గురించి ప్రతిపక్షాలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  ఇప్పుడు ఏపిలో కరోనా వైరస్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు లేని పోని విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

గత కొంత కాలంగా చంద్రబాబు ని ఏకిపడేస్తున్న వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా బాబు గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంకా తానే ఏపీ సీఎం అనుకుంటున్నారని, వీడియో కాన్ఫరెన్స్ లతో సమయాన్ని వృథా చేస్తున్నారని సెటైర్లు విసిరారు.

 

ఏపీ శాసనమండలి రద్దు కాబోతోందన్న ఆవేదనతో బాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించిన విజయసాయిరెడ్డి, రేపు చంద్రబాబు పుట్టినరోజు అని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.  ప్రస్తుతం ఏపిలో కరోనా ని కట్టడి చేయడానికి సీఎం జగన్ మోహన్ రడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: