ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 97 మండలాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. నిన్నటివరకు నమోదైన కేసుల ఆధారంగా ప్రభుత్వం రెడ్ జోన్లను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. 
 
రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వం 17 రెడ్ జోన్లను ప్రకటించింది. కర్నూలు జిల్లాలో కర్నూల్ అర్బన్, నంద్యాల, పాణ్యం రూరల్, బనగానపల్లి రూరల్, కోడుమూరు, శిరువెళ్ల, నందికొట్కూర్ అర్బన్, బేతంచెర్ల, చాగలమర్రి, గడివేముల, ఆత్మకూర్ అర్బన్, గూడూరు అర్బన్, పెద్దకడబూరు, అవుకు, ఓర్వకల్లు, ఎమ్మిగనూరు అర్బన్, ఉయ్యాలవాడ, పెద్దకడబూరు. 
 
నెల్లూరు : నెల్లూరు అర్బన్, తోటపల్లి గూడూరు, ఓజిలి, కోవూరు, కావలి అర్బన్, గూడూరు అర్బన్, బుచ్చిరెడ్డిపాళెం, బోగోలు, బాలాయపల్లె, ఇందుకూరుపేట, అల్లూరు, తడ, వాకాడు, నాయుడుపేట అర్బన్. 
 
గుంటూరు : గుంటూరు అర్బన్, నరసరావుపేట, అచ్చంపేట రూరల్, మాచర్ల అర్బన్ , పొన్నూరు అర్బన్, మంగళగిరి అర్బన్, కారంపూడి, దాచేపల్లి, చేబ్రోలు, తాడేపల్లి అర్బన్, మేడికొండూరు, క్రోసూరు. 
 
పశ్చిమ గోదావరి : ఏలూరు అర్బన్, నరసాపురం అర్బన్, కొవ్వూరు అర్బన్, పెనుగొండ రూరల్, భీమవరం అర్బన్, తాడేపల్లిగూడెం అర్బన్, ఆకివీడు, భీమిడోలు, ఉండి. 
 
విశాఖ పట్నం : విశాఖ అర్బన్, నర్సీపట్నం అర్బన్, పద్మనాభం 
 
అనంతపురం : అనంతపురం అర్బన్, హిందూపురం అర్బన్, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు. 
 
కృష్ణా : విజయవాడ అర్బన్, జగ్గయ్యపేట అర్బన్, పెనమలూరు రూరల్, నూజివీడు అర్బన్, మచిలీపట్నం అర్బన్, 
 
కడప : ప్రొద్దుటూరు అర్బన్, కడప అర్బన్, బద్వేల్ అర్బన్, పులివెందుల అర్బన్, ఎర్రగుంట్ల అర్బన్, మైదుకూరు అర్బన్, వేంపల్లె 
 
చిత్తూరు : తిరుపతి అర్బన్, నగరి అర్బన్, శ్రీకాళహస్తి అర్బన్, రేణిగుంట, పలమనేరు, నిండ్ర, ఏర్పేడు, వడమాలపేట. 
 
తూర్పు గోదావరి : రాజమండ్రి అర్బన్, పిఠాపురం అర్బన్, పెద్దాపురం అర్బన్, శంఖవరం, కొత్తపేట, కాకినాడ రూరల్, అడ్డతీగల, రాజమహేంద్రవరం రూరల్. 

 

ప్రకాశం : ఒంగోలు అర్బన్, చీరాల అర్బన్, కందుకూరు అర్బన్, కారంచేడు, గుడ్లూరు, కనిగిరి అర్బన్, మార్కాపురం అర్బన్, పొదిలి, కొరిసపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: