ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ కేసు విషయమై న్యాయస్థానంలో ఎలాగైనా గెలవాలని పక్కా ప్లానింగ్ తో జగన్ వ్యవహరిస్తున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో అలాగే మరికొన్ని విషయాలలో, న్యాయస్థానంలో అనేక ఎదురు దెబ్బలు తగలటం జరిగాయి. చాలా వరకూ తాను అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానంలో నవ్వులపాలు అయ్యాయి. ఇలాంటి తరుణంలో జగన్… నిమ్మగడ్డ వ్యవహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.

 

తనని జగన్ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని నిమ్మగడ్డ ఇటీవల హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో న్యాయస్థానం ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ పిటిషన్ కు కౌంటర్ల విషయంలో జగన్ స్ట్రాంగ్ ప్లానింగ్ తో వెళ్తున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు. జగన్ సర్కార్ నిమ్మగడ్డ పిటిషన్ కు వేసిన కౌంటర్ వివరాలు ఇలా ఉన్నాయి.



*)ఈసీ పదవీ కాలం తగ్గింపు ,మరియు పంచాయతీరాజ్ చట్టంలో మార్పులను గవర్నర్ ఆమోదించిన అనంతరమే ఆర్డినెన్స్ తెచ్చాం.

*)గవర్నర్ నిర్ణయం అనంతరం ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు.

*)2000 సంవత్సరం తర్వాత అధికారులతో నిర్వహించిన ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి.

*)ఎన్నికల కమిషనర్ సర్వీసు రూల్స్ అన్నీ హైకోర్టు జడ్జి స్ధాయిలో ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.

*)రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలం, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందే.



*)స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం మీడియా తర్వాతే ప్రభుత్వానికి చేరింది.

*)దీనికి కారణం… కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకునే ముందు రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడమే.

*)ఈ రేంజ్ లో ఏపీ సర్కారు హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను చూస్తుంటే… నిమ్మగడ్డ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడం ఖాయమనే వాదనలు బలంగా వినిపిస్తోన్నాయి! వినిపిస్తోంది.

*)కాగా… తనను తొలగించడానికే ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్న నిమ్మగడ్డ రమేశ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఏపీ ప్రభుత్వం అనంతరం పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ.. ప్రభుత్వం తరుపున 24 పేజీల అఫిడవిట్ను హైకోర్టులో దాఖలు చేశారు.





 

మరింత సమాచారం తెలుసుకోండి: