మాస్క్ ధ‌రించ‌కుండా బ‌య‌ట‌కు వెళ్తుండ‌ట‌మే కాకుండా... నిర్ల‌క్ష్య‌పూరితంగా స‌మాధానమిచ్చిన కొడుకును తండ్రి పీక‌పిసికి చంపేశాడు. ఈ సంఘ‌ట‌న బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. కరోనా వైర‌స్ వ్యాప్త అధికంగా ఉన్న నేప‌థ్యంలో బెంగాల్ ప్ర‌భుత్వం బ‌య‌ట‌కు వ‌చ్చే వారుత‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని ఆదేశించింది. లేదంటే అరెస్టులు త‌ప్ప‌వ‌ని కూడా హెచ్చ‌రించింది. ఇదిలా ఉండ‌గా కోల్‌క‌తాలోని ఓ ప్రాంతంలో నివాస‌ముంటున్న రిటైర్డ్ ప్రైవేటు ఎంప్లాయ్ బ‌న్షీదార్‌ త‌న దివ్యాంగుడైన కొడుకు మ‌ల్లిక్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి చిన్న అద్దెరూంలో జీవ‌నం సాగిస్తున్నాడు. 

 

కొడుకు దివ్యాంగుడే అయిన‌ప్ప‌టికి చాలా దుర‌ల‌వాట్లు క‌లిగి ఉన్న వ్య‌క్తి. పైగా త్రండ్రి మాటంటే ఏమాత్రం లెక్క చేయ‌ని తత్వం అత‌నిది. సాధార‌ణ స‌మ‌యంలో తండ్రికి..కుటుంబానికి ద‌మ్మిడికి కూడా ప‌నికి రాకుండా జులాయిగా తిరిగేవాడు. అయితే ఆదివారం సాయంత్రం వేళ ఎలాంటి మాస్క్ ధ‌రించ‌కుండా ఇంట్లోంచీ బయటకు వెళ్తున్న మ‌ల్లిక్‌ను చూసి బ‌న్షీదార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. మాస్క్ క‌ట్టుకుని వెళ్లు అని చెప్ప‌గా..  తెలుసు... కావాలనే పెట్టుకోలా... అవసరం లేదులే..కరోనా లేదు గిరోనా లేదు... ఈ మాస్కులూ అవీ మనకెక్కడ సెట్టవుతాయ్... అలా తిరిగొస్తా... ఇంట్లో బోర్ కొడుతోంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్ప‌డంతో తండ్రికి ఆగ్ర‌హం అరికాలికి అంటుకుంది. 

 

అలా కాదురా నీ ఒక్క‌డికి ఏమైనా మ‌న కుటుంబానికి, ఈ వాడ‌వాడంద‌రికి క‌రోనా వ‌స్తుంద‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా కొడుకు విన‌లేదు. తండ్రి మాట‌లో విసుగెత్తిన కొడుకు ఇదిగో మ‌ళ్లీ చెబుతున్న నాకు చిరాకు తెప్పించకు  అని కొడుకు అనగానే.. ఇంట్లోంచీ కాలు బ‌య‌ట‌పెడితే చంపేస్తానంటూ తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. ఏందీ చంపుతావా అంటూ ముందుకెళ్లిన కొడుకు పీక‌పై ట‌వల్‌ను బిగించేసి గ‌ట్టిగా ఆవేశంలో లాగేశాడు. ఊపిరాడ‌క మ‌ల్లిక్ మ‌ర‌ణించాడు. ఈ సంఘ‌ట‌న కోల్‌క‌తాలో సంచ‌ల‌నం సృష్టించింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: