వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు కాలేదు కానీ ఏపీలోని అన్ని పార్టీలకు శత్రువుగా మారింది. అన్నింటికీ మించి బీజేపీతో లడాయి పడుతోంది. ఏపీ బీజేపీ నేతలు పూనకం వచ్చినట్లుగా తెల్లారిలేస్తే వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా బీజేపీ తీరు వల్ల ఎక్కువగా వైసీపీ ఇబ్బందులో పడుతోంది
ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఒక దశలో వైసీపీలో చేరడానికి ప్రయత్నిచిన ఏపీ బీజేపీ సారధి కన్నా లక్ష్మీనారాయణ అయితే చంద్రబాబు కంటే ఎక్కువగా జగన్ని టార్గెట్ చేశారు. జగన్ కి ప్రతీ రోజూ లేఖలు రాయడమే కాదు, వైసీపీ సర్కా పాలన్లొ అవినీతి జరిగిందంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ సర్కార్ కొనుగోలు చేసిన రాపిడ్ కిట్ల విషయంలో బీజేపీ నేతలు గట్టిగానే తగులుకుంటున్నారు.
వీటి మీద ఒళ్ళుమండిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడుపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మండిపడిన కమలనాధులు ఆయన్ని టార్గెట్ చేశారు. కన్నాకు విజయసాయిరెడ్డి క్షమాపణకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి అవినీతి భాగోతాలను ప్రధాని ఆఫీస్ నిఘా పెట్టి గమనిస్తోందని కూడా ఇపుడు బీజేపీ నేతలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
విజయసాయిరెడ్డి అధికారం చూసుకుని మాట్లాడుతున్నారని, ఆయన లీలలు అన్నీ కూడా తమ కేంద్ర పెద్దల వద్ద పదిలంగా ఉన్నాయని కూడా బెదిరిస్తున్నారు. నిజంగా ఇది ఉత్త బెదిరింపు గానే చూడాలా, లేకా సీరియస్ గా తీసుకోవాలా అన్న చర్చ ఇపుడు ఏపీ రాజకీయాల్లో సాగుతోంది.
కోరి మరీ ప్రధాని కార్యాలయం ప్రస్తావనఎవరూ తేరు కదా. అంటే కేంద్రం కూడా వైసీపీకి యాంటీగా ఉందా. ఏపీలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ పెద్దలు నిశితంగా గమనిస్తోందా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి కామెంట్స్ బీజేపీ వైసీపీ వార్ ఢిల్లీ దాకా చేరిందా అన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.