భార‌త్‌లో కోవిడ్ మ‌ర‌ణాలు 652కు చేరుకున్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు  20471 కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 3960 మంది డిశ్చార్జి కాగా.. 652 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్రలో కోవిడ్‌-19ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఇప్ప‌టికే వేలాదిమందికి సోకిన ఈ వ్యాధి వంద‌లాదిమందిని పొట్ట‌నబెట్టుకుంది. దేశంలోనే అత్య‌ధికంగా కేసులు న‌మోదైన రాష్ట్రంగా మ‌హారాష్ట్ర ఉంది. అంతేకాదు దేశం మొత్తం న‌మోదైన కేసుల్లో పావువంతు ఇక్క‌డే ఉండ‌టం గ‌మ‌నార్హం. 


మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం కేసుల్లో ముప్పావు వంతు ముంబై ప‌ట్ట‌ణ‌, ప‌రిస‌రా ప్రాంతాల్లోవి కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశం. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 5221 మందికి కరోనా సోకగా.. 251 మరణాలు నమోదయ్యాయి. ఇక  మధ్యప్రదేశ్‌లో కరోనాతో బుధ‌వారం ఒక్క‌రోజే 35 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1587కి చేరగా.. 80 మంది మృతిచెందారు. జమ్మూకశ్మీర్‌లో  ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 407కి చేరింది. జమ్మూలో 56; కశ్మీర్‌లో 351 కేసులు ఉన్నట్టు జమ్మూకశ్మీర్‌ ముఖ్య కార్యదర్శి (ప్లానింగ్‌) రోహిత్‌ కన్సాల్‌ వెల్లడించారు. 


మ‌రోవైపు రెండు తెలుగు రాష్ట్రాల‌ను కూడా క‌రోనా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. కరోనా వైరస్‌ ఎలా సోకిందో తేలని పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో 52 ఉన్నాయని ఏపీ వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నబ‌డిన‌వారిలోనూ క‌రోనా పాజిటివ్ వ‌స్తుండ‌టం జ‌నాల్లో భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో న‌మోదైన ఎనిమిది కేసుల్లో ఆరు ఒకే ఇంటి నుంచి ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఆ ఇంటి ప‌నిమ‌నిషికి 21రోజుల త‌ర్వాత ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకున్నా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అల‌ర్ట్ అయ్యారు. క‌రోనా ఏరూపంలో వ‌చ్చి కాటేస్తుందోన‌ని జ‌నాలు బెంబేలెత్తిపోతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: