ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బఖేరా ప్రాంతానికి చెందిన యువతి ప్రేమ పేరుతో మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాల్ని శారీరకంగా అనుభవించిన ప్రియుడు తన మోజు తీరాక ముఖాన్ని చాటేశాడు. పెళ్లి గురించి ప్రస్తావన అడిగితే తప్పించుకొని తిరగడం కాకుండా చంపుతానని కూడా బెదిరించడం సాగాడు. దీనితో కోపంతో రగిలిపోయిన ప్రియురాలు ప్రియుడికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. ప్రియుడితో సహా కుటుంబ సభ్యులను అందరిని జైలు పాలు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే... ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బఖేరా ప్రాంతానికి చెందిన ఒక యువతిని అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడు కొన్ని సంవత్సరాలుగా వారు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

 

 

వారిద్దరూ ఇల్లు పక్కపక్కనే కావడంతో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలోనే ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకొని గత మూడు సంవత్సరాలుగా ప్రియుడు శారీరక వాంఛలను తీర్చుకున్నాడు. ఇక తీరా పెళ్లి విషయం అడిగే సరికి ఆమెని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా ఇకపై ఆ ప్రస్తావన తీసుకురావద్దని ఇంకోసారి పెళ్లి గురించి అడిగితే చంపుతానని బెదిరించాడు సాగాడు ప్రియుడు. అయితే ఆ యువతి పూర్తి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఆ విషయంపై ప్రియుడు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు యువతి తండ్రి వెళ్లి మాట్లాడాడు.

 


అయితే ప్రియుడు కుటుంబ సభ్యులు కూడా అదే రీతిలో బాధితురాలి తండ్రిని దూషించడంతో పాటు పెళ్లిచేసుకునేది లేదని స్పష్టం చేశారు. దీనితో అమ్మాయి కుటుంబ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు అని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అందులో యువతి తండ్రిపై  కూడా దాడి చేశారని కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: