ఎన్నో ఏళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా సిద్దిపేటలోని చిన్నకోడూరు వద్ద ముగ్గురు వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపారు. అయితే ఎల్లం గౌడ్ ఎన్నో రోజులుగా రౌడీషీటర్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా దొంగనోట్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు ఎల్లం గౌడ్ . అటు కర్ణాటక రాష్ట్రంలో దొంగనోట్ల ముద్రణ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కూడా దొంగనోట్ల విషయంలో పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఎల్లం గౌడ్ మిత్రుడు అయినా తనక వెంకట్ తో గొడవలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. తనక వెంకట్ కి సంబంధించిన ముగ్గురు అనుచరులు పథకం ప్రకారం రౌడీషీటర్ ఎల్లం గౌడ్ పై దాడి చేసి అతి దారుణంగా కత్తులతో నరికి చంపి సిద్దిపేట ఏసిపి కార్యాలయంలో లొంగిపోయారు.

 

 

 ఈ ఘటన స్థానికంగా ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు  గురిచేశారు. అయితే ఇప్పటికే ఎల్లం గౌడ్ పై వెంకట్ అనుచరులు మూడుసార్లు హత్య యత్నం  చేసినప్పటికీ పలుమార్లు తప్పించుకున్నాడు ఎల్లం గౌడ్. అయితే ఈసారి మాటు వేసి మరీ అతి దారుణంగా ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడిచేసి కత్తులతో నరికి చంపారు. సిద్దిపేట ఏసిపి కార్యాలయంలోకి వెళ్లి లొంగిపోయారు. అయితే దొంగనోట్ల ముద్రణ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఈ హత్యలు కారణం  తెలుస్తోంది. అయితే రౌడీషీటర్ గా ఉన్న ఎల్లం గౌడ్ ఐదేళ్ల క్రితం షామీర్పేట్ సమీపంలో పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో అరెస్టు కూడా అయ్యాడు. 

 

 

 ఎల్లం గౌడ్ సహా ఎల్లం గౌడ్ సహా ఎల్లం గౌడ్ అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటన లో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. అయితే తాజాగా అందరూ చూస్తుండగానే రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: