ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురి అయి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు చాలానే గమనిస్తూనే వస్తున్నాం. ఇలాంటి తరహాలోనే ఒక యువకుడు మనస్థాపానికి గురి అయ్యి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం యానికి చెందిన చైతన్య అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇటీవల తల్లితో వేరే ఊరికి వెళ్లి తాను ఒక్కడే తిరిగివచ్చాడు ఇంటికి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు తల్లి కొడుకు ఇద్దరూ కలిసి చింతరెడ్డిపాళేనికి ఊరికి వెళ్లారు. అ ఊరి నుంచి రెండు రోజుల క్రితమే చైతన్య తిరిగి రావడం జరిగింది. ఏమైందో ఏమో కానీ రెండు రోజుల నుంచి ఫోన్ తీయకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి ఇంటికి తిరిగి రావడం జరిగింది. ఇక ఏముంది అప్పటికే చైతన్య ఉరి వేసుకొని కనిపించడంతో తల్లి షాక్ కి గురి అవ్వడం జరిగింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

 


ఇక పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టారు. ఇక ఇది ఇలా ఉండగా చైతన్య ఇంటి గోడలపై సూసైడ్ నోట్ రాసినట్లు పోలీస్ అధికారులు గ్రహించడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ లో ఏముంది అనగా నా చావుకు నేనే కారణం నా మెదడు, నా మనసు నాకు శత్రువులు. గుడ్ బాయ్ మీ చైతన్య... అంటూ ఉంది. దీనితో జీవితంపై విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ అధికారులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అన్న విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు అనే చెప్పాలి. ఇక ఈ ఘటనపై పోలీసులు అధికారులు విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: