కన్న తల్లి దండ్రులు పిల్లలని తొమ్మిది నెలలు మోసి కని వారికి తప్పటడుగులు వేస్తూ ఉన్న వయసులోనే పిల్లలను అతి జాగ్రత్తగా పెంచి ఆ తర్వాత వారికి చదువును నేర్పించి అలా పెద్ద చేసి వారికి పెల్లేవయసు వచ్చే వరకు అన్నీ నేర్పిన తల్లి దండ్రులు పీలి అనగానే అన్నీ పట్టింపులు ప్రకారం చేయాలని వారి మాటే నెగ్గాలని ఏదేదో మాట్లాడుతున్నారు.. ఎలా వారి ప్రేమను కూడా తుంచేస్తుంటారు.. ఇకపోతే పెళ్లి లో చేసే సినిమాకు వేసి పిల్లల జీవితాలను నాశనం చేస్తుంటారు..
ఇటీవల తమిళ నాడులో జరిగిన ఒక ఘటనా ఇప్పుడు అందరినీ ఆలోచింప చేస్తుంది.. తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో ఓ కొడుకు కిరాతకుడిగా మారాడు. కనిపెంచిన తల్లిదండ్రులనే అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. తిరువణ్ణామలై తండ్రాంపట్టు సమీపంలోని కుప్పంతాంగల్ గ్రామానికి చెందిన గోవిందస్వామి, మాంగణి దంపతులకు కొడుకు రామ్కుమార్, ముగ్గురు కుమార్తెలున్నారు. కూలి పనులు చేసే గోవిందస్వామి ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశాడు. ప్రస్తుతం కొడుకు రామ్కుమార్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
రామ్కుమార్కు ఏం సంబంధం కుదరకపోవడంతో తల్లిదండ్రులు మదనపడేవారు. ఈ క్రమంలోనే తనకు వెంటనే పెళ్లి చేయాలని అతడు రోజూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. దీంతో బుధవారం తెల్లవారుజామున రామ్కుమార్ ఇంట్లో ఉన్న రుబ్బు రాయితో గోవిందస్వామి, మాంగణి తలపై కొట్టి చంపేశాడు. ఈ తర్వాత ఇంటికి తాళం వేసి తిరువణ్ణామలైకి సైకిల్పై వెళ్లాడు.
అయితే తల్లి దండ్రులను చూడాలని ఇంటికి వెళ్ళిన ఆమెకు గట్టి షాక్ ఎదురైంది.ఇంట్లో ఎవరూ లేరు.. ఇంటికి తాళం వేశారు.. కిటికీలో నుంచి చూడగా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఆమె కేకలు వేయగా స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. దీనిపై సమాచారం అందుకున్న సాతనూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు..