టిడిపి అధినేత చంద్రబాబును రాజకీయంగా, ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే విషయంలో ఎప్పుడూ ముందుంటారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చేసే విమర్శలకు చెక్ పెట్టే విధంగా విజయసాయి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా టిడిపి నాయకులను ఉద్దేశించి విమర్శలు చేస్తూ ఉంటారు. టిడిపి చేసే ప్రతి విమర్శ పైన పంచ్ లు వేస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు విజయసాయిరెడ్డి. కొద్ది రోజులుగా టీడీపీ వైసీపీ పార్టీ ల మధ్య కరోనా రాజకీయాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. కరోనా టెస్ట్ లు చేయడంలో కానీ, వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో కానీ ప్రభుత్వ పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అయినా టీడీపీ అదే పనిగా విమర్శలు చేస్తూ వస్తోంది.
కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని బాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదు.
— Vijayasai reddy v (@VSReddy_MP) 25 april 2020
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి. కరోనా తీవ్రతను తప్పు కప్పిపెడుతున్నారంటూ చంద్రబాబు కడవల కొద్దీ కన్నీరు కార్చినా, ఎవరూ నమ్మడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటు ఇటు తిప్పి చంద్రబాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడు అంటూ విజయ్ సాయి రెడ్డి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కూడా ఉద్దేశించి మండిపడ్డారు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదంటూ ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డి మండిపడ్డారు.
కోవిడ్ పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వైరస్ పై విజయం సాధించేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో శ్రమిస్తోంది. ఈ యుద్ధంలో ప్రజల సహకారమే కీలకం. మహమ్మారి అనేక విధాలుగా వ్యాపిస్తుంది. లాక్ డౌన్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ ఉనికిని తుడిచేయాలి.
— Vijayasai reddy v (@VSReddy_MP) 25 april 2020
కరోనా పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, వైరస్ పై విజయం సాధించేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో విజయసాయి పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ప్రజల సహకారం అనేక విధాలుగా వ్యాపిస్తుందని, నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ ఉనికిని తుడిచివేయాలని సూచించారు.
తానింకా సిఎం అయినట్టు, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రాంతిలో మునిగి తేలుతున్నాడట బాబు. సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహుకరించారని అంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2020
విజన్ 2020 పేరుతో డప్పు కొట్టుకున్న బాబు రాష్ట్రంలో కనీసం 4-5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉంటే కోవిడ్ నేపథ్యంలో ఎంతో ఊరట దొరికేది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సోది తప్ప ఊడబొడిచిందేమీ లేదు. దోచుకునే ఛాన్స్ లేదని మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గాలి కొదిలేశాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2020కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని బాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 25, 2020