దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ఢిల్లీ మత ప్రార్థనలు ఎంత ప్రమాదకరంగా మారటం జరిగిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అత్యుత్సాహం అంతే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటికే శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే చేపట్టిన ర్యాలీ వల్ల శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణం కాగా, తాజాగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం కలిగి ప్రజలకు సేవా కార్యక్రమాల పేరిట గుంపులు గుంపులు గా ప్రజలు బయటకు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందటం చాలా ఈజీగా అయిపోతుంది. నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, రోజా తర్వాత సులూరుపేట ఎమ్మెల్యే మీరు చేస్తున్న అత్యుత్సాహం పనుల వల్ల.. తాను మునగడం కాదు అందరినీ ముంచుతున్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో రావడంతో జనాలు అధికార పార్టీ పై మండిపడుతున్నారు. మేము జాగ్రత్తగా ఇంటిలో ఉంటున్న మీరు చేస్తున్న పనుల వాళ్ళ మా ప్రాణాలు తీసేటట్టు ఉన్నారుగా అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తూన్నారు. పబ్లిసిటీ పిచ్చితో మా ఇళ్లలో చావులు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారుగా అంటూ మరికొంత మంది లబోదిబో మంటున్నారు. ప్రజలంతా బానే లాక్ డౌన్ పాటిస్తున్న అధికార పార్టీ నేతలు సరిగా పాటించడంలేదని జాతీయస్థాయి లో ఉన్న మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైసిపి పార్టీ నాయకులను ఏకిపారేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple.