కరోనా ఇప్పుడు ఇది ప్రపంచం బాధ.. ఈ కరోనా మహమ్మారిని ఎలా తరిమేయాలి.. దీని బారి నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలి.. కరోనా నష్టాలను, కష్టాలను ఎలా అధిగమించాలి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాయకుల బుర్రలకు పదను పెడుతున్న ప్రశ్నలివే.. అయితే ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రం ఇంత కంటే ఎక్కువగా బాధ పెడుతున్న అంశాలు వేరే ఉన్నాయట.

 

 

అదేంటో తెలుసా.. రాజధానిని ఎక్కడ విశాఖకు తరలిపోతుందో అన్న భావనేనట. ఇది కరోనా కంటే ఎక్కువగా చంద్రబాబును బాధిస్తోందట. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శలు ఇవి. విశాఖకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లను కోర్టులో వేయించడం వెనుక విశాఖపై చంద్రబాబుకు ఉన్న విష సంస్కృతికి నిదర్శనమని దాడి వీరభద్రరావు మండిపడుతున్నారు.

 

 

చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా తానే అధికారంలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని దాడి వీరభద్రరావు విమర్శించారు. ఇంకా అధికారులను చంద్రబాబు ఇంకా తన గుప్పెట్లో ఉంచుకోవాలనే భావనతోనే ఉన్నారంటున్నారు. అందుకే.. అధికారంలో ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని దాడి వీరభద్రరావు దుయ్యబట్టారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కేంద్రానికి రాశారని చెబుతున్న లేఖ ఆయన రాసింది కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు వాస్తవం అని తేలిందని దాడి అంటున్నారు.

 

 

అటు చంద్రబాబు సైతం వైసీపీ విమర్శలకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నారు. కరోనా కాలంలో హైదరాబాద్ లో ఉంటూ.. తరచూ మీడియా సమావేశాలు పెడుతూ.. కరోనాపై ఎలా పోరాటం చేయాలో జగన్ కు సలహాలు ఇస్తూ ఉంటున్నారు. పాపం.. ఛాన్స్ లేదు కానీ.. లేకపోతే.. చంద్రబాబు రోజూ కరోనాపై అధికారులతో సమావేశాలు నిర్వహించేవారు కూడా అంటున్నారు వైసీపీ నాయకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: