దేశవ్యాప్తంగా కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా కఠిన తరంగ మారింది. ఎక్కడిక్కడ వాణిజ్య వ్యాపార సంస్థలు పూర్తిగా మూత పడ్డాయి. అందుకే స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది. ఇకపోతే కరోనా ను తరిమి కొట్టాలనే ఆలోచనలో ప్రజలు ప్రభుత్వం అందరు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు.
ఉదయం లేచిన మొదలు పడుకొనేవరకు మింగుడు పడని ఒక మాట ఈ మహమ్మారి కరోనా . ఎవరి నోటా కూడా ఒకటే మాట . కరోనా ఒక జబ్బు కాదు అనేక జబ్బుల సమ్మేళనం.. ఒక సారి కనుక ఈ కరోనా వైరస్ సోకితే జబ్బు దగ్గు జ్వరం అంటూ ఇలా వరుస పెట్టి అన్నీ వస్తుంటాయి. అందుకే కారో పేరు వినగానే సకల జీవులు భయానికి గురవుతున్నారు. కరోనా ప్రభావం ప్రపంచాన్ని ఎంతగా తలక్రిందులు చేస్తుందో తెలిసిన విషయమే..
కరోనా కారణంగా ఎన్నో పందాలను జరుపుకోలేని స్థితిలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. దీంతో వాణిజ్య కొనుగోళ్లు కూడా పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇకపోతే నేడు అక్షయ తృతీయ నాడు మహిళలు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఆన్లైన్ లో బంగారు విక్రయాలు జరుగుతున్నాయట.. వివరాల్లోకి వెళితే..
షాపుల యాజమాన్యాలు సైతం పలు రకాల ఆఫర్లతో ఊదర గొట్టేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.దీంతో ఈ సంవత్సరం అక్షయ తృతీయ వ్యాపారం కేవలం ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఫిజికల్ బంగారం బదులు, డిజిటల్ రూపంలో కొనుగోళ్లు చేయవచ్చని ఈ రంగంలోని నిపుణులు వెల్లడించారు. కస్టమర్లు పెట్టే పెట్టుబడికి సరిపడా ఫిజికల్ బంగారాన్ని ఆయా సంస్థలు ఎంఎంటీసీ లాంటి సంస్థలతో కలిసి నిల్వ చేస్తాయి. ఇక ఒక్క రూపాయి నుంచి ఎంతైనా పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ యాప్స్ పేటీఎం, ఫోన్పే, ఆగ్మెంట్, మోతీలాల్ ఓస్వాల్ తదితర ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఇందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.బంగారాన్ని కొనుగోలు చేయాలనుకేవారు త్వరపడండి...