ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ ఉనికిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడా..లేదా ప‌రిస్థితి విష‌మంగా ఉందా అనేది ఇంకా స్ప‌ష్ట‌త లేదు. అస‌లు ఆయ‌న `ఉన్నాడా?` అనే ట్విస్టు సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది.  ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆయ‌న ఎక్క‌డ ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌దు. కిమ్ గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్నార‌ని, అది విక‌టించ‌డం వ‌ల్ల‌ బ్రెయిన్ డెడ్ అయ్యార‌ని కూడా వ‌దంతులు వ్యాపించాయి. ఇలా ఆయ‌న‌పై, ఆయ‌న ఆరోగ్యంపై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉన్న త‌రుణంలో కీల‌క స‌మాచారం దొరికింది. కీల‌క‌మైన స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు కిమ్ ఉప‌యోగించే రైలు దొరి‌కింది.  


కిమ్‌కు చికిత్స అందించేందుకు ముగ్గురు చైనా వైద్యులు ఉత్త‌ర కొరియా వెళ్లారు. దీంతో కిమ్ ప్రాణాల‌పై డౌట్లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇదే త‌రుణంలో కీల‌క‌మైన స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు కిమ్ త‌న గ్రీన్ రైలును వినియోగిస్తారు. కిమ్ ప్యామిలీకి చెందిన వోన్‌సాన్ కాంపౌండ్‌లో ఆ రైలు క‌నిపించింది. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఆ రైలు అక్క‌డే ఉన్న‌ట్లు గుర్తించారు. కిమ్ ఫ్యామిలీ కోసం రిజ‌ర్వ్ చేసిన రైల్వే స్టేష‌న్‌లో ఆ రైలు ఆగి ఉం‌ది. డిపార్చ‌ర్ అయ్యేందుకు రెఢీగా ఉన్న ఆ రైలు మాత్రం కొన్ని రోజుల నుంచి క‌ద‌ల‌లేదు. శాటిలైట్ దృశ్యాల ద్వారా ఆ విష‌యాన్ని ద్రువీక‌రించారు. 

 

అయితే, ఆ రైలు ఉన్నంత మాత్రాన‌.. ఉత్త‌ర‌కొరియా నేత కిమ్ బ్ర‌తికున్నారా లేక ఆయ‌న ఆరోగ్యానికి ఏమైనా అయ్యిందా అన్న విష‌యం మాత్రం క్లారిటీ లేదు.  కానీ రైలు ఉంది కాబ‌ట్టి.. అత‌ను అక్క‌డే ఉండి ఉంటార‌న్న అనుమానాలు మాత్రం వ్య‌క్తం అవుతున్నాయి. వోన్‌స‌న్ కాంప్లెక్స్‌లో గెస్ట్‌హౌజ్‌లు, రిక్రియేష‌న్ సెంట‌ర్లు, షూటింగ్ రేంజ్‌లు, యాచింగ్ ఏరియాలు ఉన్నాయి. గ‌తంలో ఆ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ ర‌న్‌వేను ఇప్పుడు హార్స్ రైడింగ్ ట్రాక్‌గా వాడుతున్నారు. ఇదిలాఉండ‌గా, చైనా పంపిన టీమ్ ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్లారు? ఆ టీమ్‌లో వైద్య నిపుణులు ఎందుకున్నార‌ని తెలియ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: