నేటి యువత చేసే దారుణమైన పనులను చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లకు అత్తుకుపోవడం ఎన్నో చెడ్డ పనులను చేయడం నేటి యువతకి సర్వసాధారణమైపోయింది. టిక్ టాక్ వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఏదో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం సామాన్య ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాణాంతకమైన చాలెంజ్ ని అమాయకపు యూజర్ల మీదకు వదులుతుంటారు. ఫలితంగా ఆ చాలెంజ్ ని టేక్ అప్ చేసిన వారు అన్యాయంగా ప్రాణాలను కోల్పోతున్నారు.


మరికొంతమంది తమ పక్క వారిపై చాలెంజ్స్, ప్రాంక్స్ గట్రా చేస్తూ ఇతరులను భయాందోళనలకు ఆగ్రహానికి గురిచేస్తున్నారు. చివరికి మూగజీవాలను కూడా వదిలిపెట్టడం లేదంటే ఇంటర్నెట్ యువతని ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఒక సంఘటన ఉక్రెయిన్ దేశంలో చోటు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఉక్రేనియన్ కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తాను పెంచుకునే కుక్క కి బలవంతంగా వోడ్కా తాగించింది. ఆ తెల్ల కుక్క పిల్ల కి ఒక సంవత్సరం వయసు ఉంటుందని తెలుస్తుంది. వీడియోలో కనపడిన ప్రకారం... ఈ 18 ఏళ్ల అమ్మాయి తన తెల్ల కుక్క పిల్ల పై వోడ్కా పోయడంతో పాటు ఒక గిన్నెలో వోడ్కా పోసి బలవంతంగా తాగించింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను ఆమె వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయగా... అది కాస్తా బీభత్సంగా వైరల్ అయింది.


అయితే కొంతమంది ఈ వీడియోని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా... స్పందించిన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకొని ఆరా తీయగా... తాను తన స్నేహితుల ఇచ్చిన ఒక ఛాలెంజ్ ని టేకప్ చేశానని తెలిపింది. ఆ చాలెంజ్ ప్రకారం ఏదైనా కుక్కకు వోడ్కా తాగించాలి. ఆ తర్వాత ఆ వోడ్కా ప్రభావం ఆ కుక్క పై ఎలా ఉందో ఓ వీడియో తీసి షేర్ చేయాలి. ఐతే వోడ్కా తాగిన కుక్క తూలుతూ ఉన్నట్టు వీడియో లో కనిపించింది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలను మూగ జీవాలపై ప్రయోగించడం నేరంగా పరిగణించిన అక్కడ స్థానిక పోలీసులు ఆమెకు 8500ఉక్రయినియన్ హ్రివ్‌నియాల(రూ.25 వేల) జరిమానాను విధించారు. ఏదేమైనా ఆకతాయి బాలికలు పెట్టుకున్న విచిత్రమైన చాలెంజ్ కు అభం శుభం తెలియని కుక్కపిల్ల బలయ్యిందని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: