పవన్ కళ్యాణ్ వరుసగా రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ రంగంలో బిజీబిజీగా గడిపారు. తాజాగా ఇటీవల మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమా చేస్తున్నారు. దాదాపు సినిమా షూటింగ్ సగం పైగా పూర్తయింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ మొత్తం ఆగిపోవడం తో క్రిష్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసినదే. విరూపాక్ష అనే టైటిల్ పెట్టాలని పరిశీలిస్తున్నారు. మొగలుల చరిత్రాత్మక కాలంనాటి కథని ఆధారం చేసుకుని  ఓ వ‌జ్రం చుట్టూ సినిమా స్టోరీ ఉంటుందని ఫిలింనగర్ లో టాక్.

 

అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ క్యారెక్టర్ లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని కూడా జోడించనున్నట్లు ఆ కండిషన్ తోనే క్రిష్ సినిమా సంతకం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా ఎపిసోడ్లో తుగ్లక్ క్యారెక్టర్ కి సంబంధించి ఎపిసోడ్ ని బాగా ఫోకస్ చేసి తీయాలని డైరెక్టర్ క్రిష్ కి పవన్ కళ్యాణ్ చెప్పారట.

 

ఈ క్యారెక్టర్ ని ఆధారం చేసుకుని ఏపీ రాజకీయాల్లో ప్రముఖ రాజకీయ నాయకుడిని అదేవిధంగా ఆయన తీసుకునే నిర్ణయాలనీ వెటకారం గా చూపించడానికి ముందే ఒప్పందం జరిగాక ఈ సినిమా ప్రాజెక్టు పట్టాలెక్కినట్లు సమాచారం. ఆ నేత ని చాలా గట్టిగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ గా తీయబోయే తుగ్ల‌క్‌ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుందని, మరోపక్క ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేశారో ఆ సెటైర్ లు ఎలా ఉంటాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: