ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. క్షణికావేశాలకు పోయి సొంత వారి ప్రాణాలు తీస్తున్న వారు ఎక్కువై పోతున్నారు. కనీసం మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు చాలామంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అంతా ప్రశాంతంగా వున్న సమయంలో సైకో గా మారిన కొడుకు తండ్రి ని అతి దారుణంగా చంపేశాడు. మాటలకందని విధంగా చిత్రహింసలకు గురి చేసి  అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కొడుకు ఒక్కసారిగా కర్కోటకుడిగా  మారిపోవడంతో తండ్రి షాక్ లోకి వెళ్లిపోయాడు . ఆ షాక్  లో కనీసం తప్పించుకోవలనే  ఆలోచన కూడా లేకుండా అయిపోయింది. దీంతో రెచ్చిపోయిన కొడుకు తండ్రిని  అతి దారుణంగా హత్య చేశాడు. 

 

ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగపూర్ లో నివసిస్తున్న విజయ్ అనే 55 ఏళ్ల వ్యక్తికి విక్రమ్ అనే 25 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. విక్రమ్ జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. ఇక శనివారం రాత్రి అంతా ప్రశాంతంగా ఉంది.ఇంతలోనే  విక్రమ్ ఉన్మాదిగా  మారిపోయాడు. తన తండ్రిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని తండ్రి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే తండ్రి గొంతును విక్రమ్ బలంగా కొరికాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతుండగా కనికరం లేకుండా తండ్రిని ఈడ్చుకెళ్లి  వరండా లో పడేశాడు. అనంతరం మరింత కర్కోటకుడు గా మారిన విక్రమ్... కత్తితో తండ్రి జననాంగాలను   కోసేసాడు. 

 

 

 అప్పటికే తీవ్ర రక్తస్రావమై కోన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రి కొడుకు హింస తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇదంతా తల్లి సోదరి కళ్ళెదుటే జరగడంతో వాళ్లు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తండ్రిపై అతి దారుణంగా దాడి చేస్తున్న విక్రమ్ ను  అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కూడా బెదిరించాడు విక్రమ్. అయితే విక్రమ్ హత్య చేస్తున్న సమయంలో సినిమా డైలాగులు చెబుతూ తన తండ్రిని దారుణంగా హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: