ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సంచలనం సృష్టిస్తూ ఉంటే... మరోవైపు దుర్మార్గులు హత్యలు, మానభంగాలు చేసేందుకు వడి కడుతున్నారు. ఒకవైపు దేశం మొత్తం అతలాకుతలం అవుతుంటే.. ఈ దుర్మార్గులు మాత్రం వారి పనిలో వారు ఉన్నారు. ఇక దేశం మొత్తం కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో అర్థంకాని పరిస్థితిలో ప్రజలు అతలాకుతలం అవుతుంటే, మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని ఒక ఆలయంలో ఇద్దరు పూజారులు హత్యకు గురైన సంఘటన అందరినీ భయాందోళనలకు గురి చేస్తుంది. 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ... ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ ఆలయంలో ఇద్దరు పూజారులను ఒక దుర్మార్గుడు హత్య చేశాడు. ఈ సంఘటనపై బులందర్ షాహర్ SSP సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... ఆలయంలో ఇద్దరి పూజార్ల మృతదేహాలు గుర్తించడం జరిగింది అని తెలిపాడు. ఇటీవల ఒక వ్యక్తి చింత ప్రాంతానికి చెందిన ఇద్దరి పూజారులు అతనిని దూషించడం జరిగింది. దీనితో ఆ వ్యక్తి ఆ ఇద్దరి పూజారులను హత్య చేయడం జరిగింది అంటూ తెలిపాడు. అలాగే ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టి ఆ నిందితుని అరెస్టు చేశాం అంటూ SSP సంతోష్ కుమార్ సింగ్ తెలియజేశాడు. ఇంకా ఈ సంఘటనపై అన్ని రకముల దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నాను అంటూ ఎస్పీ తెలిపారు. 

 

ఇక పూజారులు మృతదేహాలను పోస్టుమార్టం చేసేందుకు హాస్పిటల్ కి తరలించామని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా ఇంకా చాలా విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి అంటూ సంతోష్ కుమార్ సింగ్ తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై వివరాలను సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్విట్టర్లో  తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఒకవైపు జనాలు కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంటే మరోవైపు ఇలాంటి ఘటనలు రోజురోజుకీ బాగా పెరిగిపోతున్నాయి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: