ఒక పని మనిషి తాను మూడు సంవత్సరాలుగా పని చేస్తున్న ఇంటి అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి కలకలం రేపింది. ఒక పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ప్రేమలత టింగా ముంబైలోని ఖర్ ఈ ప్రాంతంలో ఉన్న పార్కు విశిష్టత అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఒక దంపతుల ఇంట్లో సదరు యువతి పనిచేస్తుంది. అయితే ఆ యువతి కేవలం పనులు మాత్రమే చేసుకొని వెళ్లకుండా వారి పిల్లలు కూడా ఆడిస్తూ చూసుకునేది. గత మూడు సంవత్సరాలుగా వాళ్ళింట్లో పని చేస్తూ వస్తోంది.


అయితే ఆమె సడన్ గా ఆమె అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్ నుంచి అమాంతం దూకేసింది. ఇది చూసిన వారి పెంపుడు కుక్క అరవడం మొదలు పెట్టింది. దీనితో అప్రమత్తమైన సదరు యజమాని ప్రియాంక వచ్చి చూడడంతో ప్రేమలత అపార్ట్మెంట్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం చూసి ఒకింత షాక్ కు గురైంది ఆవిడ. దీంతో ఆమె సమాచారం పోలీసులకు చేరవేశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఆత్మహత్య కారణాలపై పూర్తి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు.


అయితే పోలీసులు విచారణ జరిపిన మేర ప్రేమలత ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని వారు అనుమానిస్తున్నారు. అయితే ప్రియుడుతో ఆమె విడిపోవడంతో మానసికంగా కుంగి పోయిందని తాను డిప్రెషన్ తోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని వారు భావిస్తున్నారు. అయితే సదరు మృతురాలి ఫోన్ ని సేకరించి కాల్ డేటాను పరిశీలనలో ఉంచారు. తను ఆత్మహత్య చేసుకున్న సమయంలో పిట్ట గోడ తగిలి ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే కింద పడిన తర్వాత ఆమెను హాస్పిటల్ కు తీసుకుని వెళ్లేసరికి ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే పోలీసులు ఈ సన్నివేశాన్ని ప్రమాద కారణంగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: