నేటి యువత చాలా మంది పెళ్ళైన కొత్తలో వెంటనే పిల్లలు వద్దని కొంత గ్యాప్ ని కోరుకుంటారు. అయితే ఒక వేళ గ్యాప్ తీసుకోకపోతే చాలా మందికి వెంటనే ప్రెగ్నెస్సీ వస్తది. మరికొంత మందికి కాస్త టైమ్ పడుతుంది. అయితే తొందరగా ప్రెగ్నెస్సీ వస్తే కనుక చాలా మంది కొంత గ్యాప్ తర్వాత పిల్లలను కందామనుకుంటారు. అయితే ఇలా వద్దనుకోవడానికి కూడా అనేక కారణాలు ఉండవచ్చు కొందరికి ఆర్ధిక ఇబ్బందులు ఉంటే... మరికొందరికి భార్యాభర్తలిద్దరూ కూడా చాలా మంది ఉద్యోగస్తులయితే కనుక పిల్లలను చూసుకునేవాళ్ళు లేక ఇబ్బంది పడవల్సి వస్తుందని మరికొంతమంది వద్దనుకుంటారు.
దాని కోసం ఒకొక్కరు ఒక్కో పద్ధతిలో శృంగారాన్ని చేస్తారు. కొంత మంది సేఫ్టీలు వాడితే మరికొంత మంది ఆడవారికి వచ్చే రుతుక్రమాన్ని ఆయా తారీఖులను ఫాలో అవుతారు. మరికొంత మంది సెక్స్ పూర్తయ్యాక పురుషుల్లో విడుదలయ్యే వీర్యాన్ని లోపల చేయకుండా వీర్యం వచ్చే సమయానికి బయటకు తీసేయడం లాంటివి చేస్తుంటారు. ఇక మరికొంతమందైతే ఏకంగా మందులు వాడతారు. అయితే మొదట్లోనే పిల్లలను ఒకసారి వద్దనుకుంటే కనుక ఆధ్యాత్మికంగా తీసుకుంటే ప్రకృతి ధర్మాన్ని బ్రేక్ చేయడం సరైనది కాదంటున్నారు. ప్రకృతి ధర్మం ప్రకారం ఎప్పుడు జరగాల్సిన అప్పుడు జరగాలి లేకపోతే మళ్ళీ మనం పిల్లలు కావాలని ఎంతగా వేడుకున్నా అని నెరవేరడం కాస్త కష్టతరమైన పద్ధతి అని నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే పెళ్ళైన కొత్తలోనే ఆ ఎంతసిసమ్ అనేది ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఆ సంవత్సరంలోనే హార్మోనలేఇ కూడా బాగా విడుదలవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కాదనుకోవడం మాత్రం సరైనపని కాదు. ఒకసారి వద్దనుకుంటే చాలా మందికి మళ్ళీ తిరిగి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టమయిపోతుంది. అందులోనూ నేటి యువతలో పని ఒత్తిడి కావొచ్చు మరేదైనా కావొచ్చుకాని దాని వల్ల కూడా కొందరు స్త్రీలలో ఒత్తిడి ఎక్కువయితే ఆ టెన్షన్ వల్ల కూడా కొంత మందికి బ్లీడింగ్ అయిపోతుంది.