అంతన్నాడు డింతన్నాడే గంగరాజు అన్నట్టుగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఏ పాల్ పరిస్థితి తయారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయంకరమైన హడావిడి చేశారు. ఆ టైంలో ఎన్నికలు చాలా సీరియస్ గా జరుగుతున్న తరుణంలో కేఏ పాల్ వ్యవహరించిన తీరు చాలా కామెడీగా తయారైంది. జరిగిన ఎన్నికలలో చాలా చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత అమెరికా కి చెక్కేసారు. ఇలాంటి సమయంలో ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో అమెరికా నుండి ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.

 

అంతేకాకుండా చైనా నుండి కరోనా వైరస్ వల్ల చనిపోయిన ప్రతి వ్యక్తికి నష్టపరిహారం ఇప్పిస్తామని మోడీ తనతో పాటు పని చేయాలని ఇలా రకరకాలుగా హామీలు కహానీలు చెప్పడం జరిగింది. అదే టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటుగా అమెరికాలో రాష్ట్రాల గవర్నర్ లతో మీటింగ్ అవుతున్నట్లు కరోనా కట్టడి చేయడంలో తాను కూడా ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తనకున్న ఆస్తులలో కొన్నిటిని కరోనా వైరస్ హాస్పిటల్ గా వాడుకోవచ్చని ప్రభుత్వాలకు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు.

 

ఇటువంటి సమయములో కే ఏ పాల్ మత ప్రబోధకుడు గా ఉన్న సమయంలో...తన దగ్గర భగవంతుడు ఆశీస్సులు మరియు చాలా శక్తులు ఉన్నాయని చెప్పటంతో మిస్టర్ పాల్ ఎక్కడున్నావ్ కరోనా వైరస్ ని నీ శక్తులతో ఆపు ప్రపంచాన్ని రక్షించు అంటూ సోషల్ మీడియాలో ఎటకారంగా నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు. తాను తలుచుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన ఆపగల శక్తి సామర్థ్యం తనకు భగవంతుడు ఇచ్చినట్లు గతంలో చెప్పడంతో ఇప్పుడు నెటిజన్లు ముందు కరోనా వైరస్ ని ఆపండి కేఏ పాల్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: