ప్రస్తుతం దేశంలోకరోనా మహమ్మారి ప్రతాపాన్ని తీవ్ర రూపంలో చూపిస్తుంది.  రోజు రోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్య, మరణాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపిలో కరోనాపై సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని అందరూ అంటున్నారు.  ఎప్పటికప్పుడు అధికారులు, మంత్రులతో ఆయన సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ కరోనాపై పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్య శాఖను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  తాజాగా కరోనా మహమ్మారి కట్టడి విషయంలో వైఎస్ జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటున్న చర్యలను సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ సమర్థించారు.  

 

ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. ఏపిలో తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని అన్నారు. కరోనా పరీక్షలను చేయడంలో ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా ఉందని కితాబిచ్చిన ఆయన, కరోనాపై జగన్ చేసిన వ్యాఖ్యలనూ సమర్థించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, ఎన్ని ఎక్కువ టెస్ట్ లు చేస్తే అంత మంచిదని.. లాక్ డౌన్ తో ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు కలిగిందని, ప్రజారోగ్యంపై దృష్టిని సారించే సమయం లభించిందని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.

 

టెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు.  ఇక సాధ్యమైనంత వరకూ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు. అంతే కాదు ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని లక్ష్మీ నారాయణ సూచించారు. ఆపై రెడ్ జోన్లపై మరింత దృషని సారించి, మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయవచ్చని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: