అత్త రాసలీలకు అల్లుడు అడ్డు వస్తున్నాడని అల్లుడిని అత్త పైకి పార్షల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే...జమ్మూకి చెందిన సుర్జీత్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఘజియాబాద్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్‌లో భార్య రషికతో కలసి నివాసం ఉండేవాడు. అతని భార్య రషిక తల్లి రమ రైల్వే టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న దేవేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.



 

ఇద్దరూ రాసలీలలు సాగిస్తున్న విషయం అల్లుడు సుర్జీత్‌కి తెలియడంతో అడ్డుచెప్పాడు.భార్య తల్లి రోజు అతన్ని కలుస్తుంది.. దాంతో ఆమె పద్దతి మార్చుకోవాలని భార్యతో గొడవ పడేవాడు.. వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరిస్తుండేవాడు. తన అక్రమ సంబంధానికి కూతురి సపోర్ట్ కూడా ఉండడంతో అల్లుడి మాటలు పట్టించుకోకుండా అత్త ప్రియుడితో రాసలీలలు సాగించేది.





ఇక అదే విషయమై సుర్జీత్ మరోమారు భార్యతో గొడవ పడడంతో ముగ్గురూ కలసి అతనిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.. అత్త ఫోన్ చేసిందని ఆమె ఇంటికి వెళ్లాడు సుర్జీత్. అప్పటికే అక్కడ అత్త రమతో పాటు దేవేంద్ర ఉన్నాడు. వారితో మాట్లాడుతుండగా భార్య రషిక కత్తితో అతనిని వెనక నుంచి పొడిచేసింది. తలపై బలంగా కొట్టింది. అనంతరం అత్త, ఆమె ప్రియుడు కలసి సుర్జీత్‌ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.






శవాన్ని సుర్జీత్ క్వార్టర్స్‌కి సమీపంలోనే ఉన్న ఖాళీ క్వార్టర్స్‌లో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకులైన భార్య రశిక, అత్త రమాను, దేవేందర్ ను అరెస్ట్ చేశారు .. పద్దతి మార్చుకో అన్నందుకే అల్లుడిని అతి కిరాతకంగా చంపిన వారందరికీ పోలీసులు తగిన బుద్ది చెప్పారు.. శవాన్ని పోస్ట్ మార్థం కోసం ఆసుపత్రికి తరలించగా, నిందితులను అరెస్ట్ చేసి రిమాం డ్ కు పంపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: